



కాశవాణిని విడిచిపెట్టలేదు.రేడియో కార్యక్రమాలకు రచన చేయడం, రేడియోలో స్వరాన్ని పలికించడం, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, ఇవన్నీ చెప్పలేనంత సంతోషాన్ని కలిగించేవి. ఆకాశవాణి ప్రాంగణంలో సంగీత సాహిత్యాలలో గొప్ప గొప్ప వారె౦దరితోనో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. శ్రవ్య మాధ్యమాన్ని సుసంపన్నం చేసిన లబ్ద ప్రతిష్టులెందరితోనో పరిచయ భాగ్యం కలిగింది. ఉద్యోగమంటూ చేస్తే ఆకశవాణిలోనే చెయ్యలి అనే ఆశ కోరిక కలిగి కాలం గడిచేకొద్దీ అది బలంగా వెళ్లూనుకుంది. ఆ కోరిక వెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మొత్తానికి సాధించాను. రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగానికి స్వస్థి పలికి, ఆకాశవాణిలో చేరాను.కొంత కాలం కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేశాను. ఆ సమయంలో శ్రీ దేవళ్ల బాలకృష్ణగారు, శ్రీ గొల్లపూడి మారుతీరావు, డా.ఆర్.అనంత పద్మనాభరావుగార్లతో కలసి పనిచేయడం, నాకు ఎన్నొ అనుభూతులని మిగిల్చింది. అక్కడినుండీ బదిలీ మీద హైదరాబాదు దూరదర్శన్లో ప్రవేశించాను. ఆ బదిలీ నా వృత్తిగత జీవితంలో పెద్ద మలుపు. శ్రవ్య మాధ్యమంలోంచి నేను దృశ్యమాధ్యమంలోకి ప్రవేశించాను.
న కలిగింది. ఆ అలోచనే మీ ఉత్తరాల కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాను. నేను చేప్పేది ముప్ఫై ఏళ్ల నాటి మాట. శ్రోతలు అనూహ్యంగా స్పందించారు. పదుల సంఖ్యలో ఉత్తరాలు వందలు దాటి వేల సంఖ్యలోకి పెరిగిపోయాయి. ఆ అనుభవంతోటే నేను దూరదర్శన్లో జాబులు-జవాబులు కార్యక్రమం నిర్వహించేవణ్ణి. ఏదో ఉత్తరాల కార్యక్రమమేకదా అని తెలిగ్గా తేసుకోలేదు. ప్రసారానికి రెండు మూడు రోజుల ముందునుచే చాల హోం వర్క్ చెసేవాణ్ణి. కార్యక్రమంలో చదవగలిగే పాతిక, ముప్ఫై ఉత్తరాలే ఐనా వచ్చిన వందలాది ఉత్తరాలని మొత్తం చదివేవాడిని. ప్రశంశలకన్నా నిర్మాణాత్మకమైన సూచనలు, విమర్శలు చేసే ఉత్తరాలకి ప్రాధన్యం ఇచ్చేవాణ్ణి.కార్యక్రమం నిర్మించేటప్పుడు వుండే సాధక బాధకాలు వివరించేవాణ్ణి. అలాగే నాకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గొవిందు చౌదరి గారు నిర్వహించే తీరులోనుంచి మెలుకువలు నేర్చుకున్నాను. మొత్తంగా ఇవన్నీ కలిసి, ఈ కార్యక్రమానికి గణనీయమైన ప్రేక్షకాదారణ సంపాదించి పెట్టాయి. ఇక ఆ కార్యక్రమన్ని నిలిపివేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నా తరువాత కొంతమంది ఆ కార్యక్రమన్ని నిర్వహించారు. కారణాలేమైనా, ఆ కార్యక్రమంలో ఆకర్షణ తగ్గింది. అంచేత కాలక్రమంలో అది కనుమరుగైంది. ఇక మళ్లీ నేను నిర్వహించడమనేది బహుశా ఉండకపొవచ్చు. ఎందుకంటే కొత్త నీటికి చోటివ్వాలంటే పాతనీరు ముందుకి ప్రవహించాలికదా!"
డా వెన్నంటే వుందని అర్ధమైంది. మా నాన్న గారు శశాంక చాల చిన్న వయస్సులోనే పరమపదం చేశారు. మా కుటుంబంలో ఒక దీప స్థంబంలా నిలిచిన మా అమ్మగారు శ్రీమతి హైమావతి కుడా నడివయస్సునాటికే పరమపదం చేశారు. అలాగే మా తమ్ముడు రామభద్రరావు నడివయస్సుకుడా చేరకముందే నాలుగు పదుల వయస్సులో మా అమ్మని నాన్నని అనుసరించాడు. ఇక అన్నిటికి మించిన దురదృష్టం నా శ్రేమతి వోలేటి కృష్ణకుమారి ఇటేవలే ఒక సంవత్సరం క్రితం అకస్మాత్తుగా కన్నుమూసింది. ఆమె అకాల మరణం జీవితం నిర్వీర్యం ఐనట్లుకనిపిస్తోంది. నా ప్రసార మాధ్యమ జీవితంలో వీరిద్దరిదీ చాలా కీలకమైన భూమిక. ఆ ఇద్దరూ నిష్క్రమించడం, జీర్నించనలవికాని దురదృష్టం. ఇక ప్రస్తుతం నేనూ, మా ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు శశాంక, మా నన్నగారి పేరే. బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్నడు. రెండవవాడు హేమంత్. మా అమ్మగారి పేరు హైమావతి కావడం, ఈ పిల్లవాడు మగపిల్లవాడు కావడంవల్ల ఆ పేరు పెట్టే అవకాశం లేక హేమంత్ అని పేరు పెట్టాను. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నవయస్సులొనే కష్టాలు ఎదురొచ్చినా చాలా పరిణత మనస్కులై వ్యవహరిస్తారు. అది భగవంతుడు వారికిచ్చిన వరమే. చివరిగా ఒక్క మాట చెప్పాలి. మూడున్నర దశాబ్దాల క్రితం మా అమ్మగారి కోరిక ఒకటి తీర్చాలని ఇటీవలే నెరవేర్చాను. యార్లగడ్డ బాల గంగాధరరావు గారి సౌజన్యంతో తెలుగులో నామవిగ్జ్యాన శాఖలో ఒక పరిశొధన పూర్తి చేశాను. ఆ సిద్ధాంత వ్యాసాన్ని బెర్హంపూర్ విశ్వ విద్యాలయం వారికి పి.హెచ్.డి. పట్టా కోసం సమర్పించాను. ఆ లాంచనాలన్ని ఇటీవలే ముగిశాయి. అదృష్టం ఆలంబనగా నాకు సంక్రమించిన ఈ పేరు ముందు ఇప్పుడు ఒక అక్షరం వచ్చి చేరనుంది. అదే డా. (డాక్టరేట్)"
మూలల నుండీ కళాకారులు ఈ కార్యక్రమంలొ పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నరంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత చెప్పకనే చెపుతోంది. కూచిపుడి భరతనాట్యం లాటి సాంప్రదాయ నృత్యాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం విశెషంగా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం నంది అవార్డును కూడా అందుకుందీ అంటే ఆ ఖ్యాతి పూర్తిగా కార్యక్రమ నిర్మాత శ్రీమతి యార్లగడ్డ శైలజ గారిదే. శ్రీమతి యార్లగడ్డ శైలజ గారితొ పరిచయాన్ని సగర్వంగా సమర్పి స్తోంది సమీహ.
సంతౄప్తి. ఎక్కడ సాహితీ కార్యక్రమాలు జరుగుతున్నా వెడుతూ ఉండేదానిని. కొన్ని రేడియో కార్యక్రమాలలొ కూడా పాల్గొన్నాను. అలాంటి సమయంలొనే దూరదర్శన్ లొ ప్రొడ్యూసరు ఖాళీ కి దరఖాస్తు చేయడం ఆ ఉద్యోగం నాకు రావడం జరిగింది.రేడియో లాంటి సంస్థే దూరదర్శన్ కూడా కాబట్టి నేను దీనిలోచేరడం జరిగింది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లొ శిక్షణ పూర్తయ్యాకా నాకు ఎంతో ఇష్టమైన సంస్థలోకి వచ్చిన అనుభూతి కలిగింది. "
ర్యక్రమానికి ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీమతి శొభానాయుడును యాంకరుగా నిర్నయించారుట. ఆమెను సంప్రదించి కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ వివరించడం, ఆమె అంగీకారం ఐనతరువాతి రోజు ఆవిడ అదే కాన్సెప్ట్ తొ మరొక చానల్ లొకార్యక్రమాన్ని ప్రారంభించి విస్మయ పరిచేరుట. ఔరా!! కళా తపస్వి విశ్వనాధ్ గారు, సినారే, నాగేశ్వరరావుగారు, రోజారాణీ, కవిత ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమం చూసిన విశ్వనాధ్గారు "వచ్చే జన్మలో ఆడపిల్లనై పుట్టి మువ్వల సవ్వడిలో నాట్యం చేయాలని ఉంది" అన్నారుట. దూరదర్శన్లో కార్యక్రమ నిర్మాణానికి ప్రొడ్యూసర్లకు పరిమితులేమైన ఉన్నాయా అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక భాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా మా పరిమితులేమిటొ మాకు తెలుసు. కుటుంబానికి ముఖ్యంగా డ్రాయింగ్ రూములొ ప్రధానమైన టీవిద్వారా కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి వీక్షించగల కార్యక్రమాలు రూపొందించడానికి దూరదర్శన్లొ స్వేచ్హ ఎప్పుడూ ఉంటుంది. వివిధ చానళ్ల హోరులో కూడా దూరదర్శన్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి వివిధ కార్యక్రమాల రూపకల్పనలో ప్రొత్సహించే మా డైరక్టర్ డా.పాలకుర్తి మధుసూదన రావుగారికి, ప్రతీ ఒక్కరికీ నా కృతజ్గ్నతలు తెలుపుకోవాలి అన్నారు శైలజ గారు. దూరదర్శన్ మరింత ప్రేక్షకాదరణ పొందాలంటే ఏమి చేయాలని ప్రశ్నిస్తే " దూరదర్శన్కి ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుంది. సాహిత్యం, సంగీతం, వ్యవసాయం, జానపద కళారూపాలు, క్రీడలు, వంటివి అందిస్తున్నా యువత అభిరుచిననుసరించి కొత్త కార్యక్రమాలు రావాలి. గొప్ప గొప్ప సెట్టింగ్స్, ఆర్భాటాలు, హంగామా లేకున్నా కార్యక్రమాలని రూపొందించేవారికి ప్రభుత్వ పరంగా ప్రొత్సాహాకాలు అందించాలి ". మరి ఇతర కార్యక్రమ వివరాలు ఏమిటి అంటే మువ్వల సవ్వడిలో రెలిటివ్ స్పెషల్స్ మ
రింత ఆదరణ సాధించుకుంటే మారాకు తొడిగిన్ చిరుమువ్వల సవ్వడి ఇటీవల హైదరాబాదు విజయవాడల్లో సెలక్షన్లు జరిగాయి. ఇది మూసకట్టు కార్యక్రమమలా కాకుండా ప్రేక్షకులను మరింత దగ్గిరగా చేర్చుకుంటోంది. అలాగే శాశ్త్రీయ సంగీతం ఇతివృత్తంతో గాన గాంధర్వం, విన్నుత్న ప్రక్రియలో రైతే రాజు కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు శైలజ గారు. కార్యక్రమ నిర్మాణం అనేది కుడా ఒక కళ. ఆ కళలొ మీరు ఎంతవరకూసఫలీకృతం అయ్యారని మీరు అనుకుంటున్నారు అని అడిగితే నాకొచ్చిన పురస్కారాలే నేనెంత వరకు సఫలీకృతం అయ్యానో చెపుతాయి. 1984, 1985 సంవత్సరాలలొ రెండు సార్లు నంది అవార్డులు వచ్చాయి. రెండుసార్లు దూరదర్శన్ నేషనల్ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ భాషా పురస్కారం అవార్డు వచ్చింది.మువ్వల సవ్వడి్కి ఈ సంవత్సరం మరల నంది అవార్దు వచ్చింది.సిఎమెస్, న్యూ ఢిల్లీ నుండి అవార్డు వచ్చింది. ఇంకా స్వచ్చంద సంస్థలు అందించిన అవార్డులు ఎన్నో. మరి మీ కుటుంబ విషయాలేమిటి కుటుంబ పరంగా ఎలాంటి సహకారం లభిస్తోందని అడిగితే నా భర్త పేరు యార్లగడ్డ కుటుంబరావు. నాకొక కుమార్తె చిరంజీవి శరద్యుతి.మావారు మంచి సంస్కారి. వృత్తిపరంగా ఎనలిస్టిక్ కెమిస్ట్. ఆయన ప్రొత్సాహం లెకుంటే నేను కొన్ని వందల కార్యక్రమాలు రూపొందించగలిగేదానిని కాదు. పగలనకా రాత్రనకా రికార్డింగులు, ఎడిటింగులు చేస్తూ పోతున్నా ఏనాడూ పెదవి విప్పి ఒక పొల్లు మాట అనని మనిషి. ప్రతీ క్షణం నన్ను ప్రొత్సహిస్తూ నాకు ఒక గుర్తింపు రావాలని తపించే నా భర్త, అత్తవారింటి వైపునుండీ వచ్చే అప్యాయతానురాగాలూ ఈ జన్మకివి చాలు అనిపిస్తుంది. నా కూతురు శరద్యుతి భగవంతుడు నాకిచ్చిన ఒక వరం. నేను నేర్చుకోలేనివి ఏవైనా తనద్వారా తీర్చుకోవాలని ఎంతో ఆశ. గత ఆరు సంవత్సారాలుగా భరత నాట్యం నేర్చుకుంటోంది. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్లొ చదువుకుంటోంది. నేను తనకోసం కాక ఆఫీసుకు కష్టపడుతూంటే చూసి ఆనందించేంత పెద్ద మనసున్న చిన్న తల్లి అన్నారు శైలజ గారు. ఎన్నొ అవార్డులు సొంతం చేసుకుని, ఒక ప్రభుత్వ సంస్థలొ అసిస్టంట్ డైరక్టర్ హోదాలో ఉన్న మహిళ తన భర్త, కూతురు విషయం వచ్చేసరికి ఒక ఇల్లాలిగా ఒక మాతృమూర్తిగా స్పందిచడం.......... ఇదే భారతీయ స్త్రీలు కుటుంబానికి ఇచ్చే గౌరవం... ఇది వారి గొప్పదనం. శైలజగారు మరెన్నొ ప్రేక్షకాదరణ పొందే కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ.....అభినందనలతో సమీహ ..
డవడ౦ నేర్చుకున్నాను. ఈ నది ఆవలి వడ్డు కి ఇప్పుడు నేను సులువుగా వెళ్లిపోగలను అని చెప్పాడుట. దానికి గురువు ఓరి నీ మొహ౦ మ౦డా! ఇదు నిమిషాలలొ పడవలో వెళ్లిపోయే పనికి ఇరవై స౦వత్సరాలు వృధా ఛేసావుకదా అని తిట్టి ప౦పి౦చాడుట. చేసినపనికి, నేర్చుకున్న కళకి సార్ధక౦ ఉ౦డాలి. పలువురు మెచ్చాలి అన్నది నా ఉద్దేశ్య౦ అన్నారు బాలి. బాలి బొమ్మలు తెలుగు సా౦ప్రదాయాన్ని పల్లె వాతావరణాన్నిచక్కగా ప్రతిబి౦బిస్తాయి.ఆయన పెరిగిన వాతావరణ౦ కూడా అలాటిదే. "మా అమ్మ పేరు అన్నపూర్ణ, నాన్న పేరు లక్శణరావు. అమ్మ చక్కగా పాడేది. రాత్రిపూట ఆ౦జనేయ ద౦డక౦ మొత్త౦ చదివి ఇక పడుకో౦డి. తెల్లవార్లూ ఆ౦జనేయుడు మన చుట్టూ తిరుగుతూ మనకి కాపలా ఉ౦టాడు, దెయ్య౦వచ్చినా దొ౦గోడు వచ్చినా చ౦పేస్తాడు అని అనేది. మే౦ ప్రొద్దుట లేస్తూనే రాత్రి ఆ౦జనేయుడు వచ్చడా అని ఆడిగేవాళ్ల౦. ఈ రాత్రి మీకు చూపిస్తాలే అని అమ్మ అనేది. అవి రె౦డొ ప్రప౦చ యుద్ద౦ చివరి రోజులు.మా నాన్న మిలటరీ లోనే కదా ఉద్యోగ౦. మా అమ్మ , మాకు ధైర్య౦ చెపుతూ తాను ధైర్య౦ పొ౦దేది. మా
నాన్న ను౦డి ఉత్తరాలు వచ్చేవి. ఇటలీ, సి౦గపూర్ ల ను౦డి వచ్చేవి. కొన్నాళ్లకు మా నాన్నగారు ఊటీ లోని వెల్లి౦గ్టన్ తీసుకువెళ్లి పోయారు. అక్కడ మరో స౦త్సరానికి మా నన్నగారు చనిపోయారు. మళ్లీ మేము అనకాపల్లిలోని మా మామయ్య ఇ౦టికి వచ్చేసాము. మా అమ్మ దుఖ్ఖ్హ౦తో మా నాన్నకుస౦భ౦ధి౦చిన మిలిటరీ పెట్టెలని ఒక పన్నె౦డేళ్లపాటు తెరవలేదు. దానిలొ మిలటరీ ఉన్ని బట్టలు, ఫొటోలు కాగితాలు పెన్నుఉన్నాయి. ఇవి కాక అరలో చైనా రన్గు కేకు, బ్రష్ లు ఉన్నాయి. ఇ౦కా ఒక పైయిటి౦గు ఉన్నాయి. దానిలోచెట్లూ, కొ౦డలూ, అడవులూ, సన్నని బాటలో సైకిలు తొక్కుతున్న వ్యక్తి ఉన్నాయి. ఇవన్నీ నాలోపరోక్ష౦గా బీజాలు నాటాయి. ఇ౦తలో ప్రభుత్వ ఉద్యోగ౦ వచ్చి౦ది. జీవన బృతికి తప్పదుకదా!ఉద్యోగ౦ చేస్తూ౦డగానే ఆ౦ధ్రజ్యోతి విజయవాడ ను౦డీ పిలుపు వచ్చి౦ది. శ౦కర్రావు పేరు బాలి గా మారడ౦మిగిలి౦ది మీకు తెలిసి౦దే. బొమ్మలు వేయడ౦లో నాకు పరిపూర్ణమైన ఆన౦ద౦ విజయ౦ లభి౦చాయి.
సమీహ బ్లాగుకోసం మీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇంటికి రండీ అని పిలిచారు బాలి. ఒక సాయంవేళ సికిందరాబాదు సీతఫల్మండీ లోని వారి ఫ్లాటుకి వెళ్లాను.తలుపు తెరిచి సాదరంగా అహ్వానించారు. చిత్రకారుడి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారి ఫ్లాటు. కుర్చీలో అసీనులయ్యకా సుభ్రపరచిన ద్రాక్ష పళ్లని ప్లేటు నిండా ఉంచి తీసుకువచ్చారు. వాటిని తింటూ మా కబుర్లు ప్రారంభించాము. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను మొదటి సారి బాలిగారిని కలిసేను. తెల్లని ఛాయ , నల్లని(?) ఒత్తైన జుట్టూ , ఒత్తైన మీస కట్టూ , మొహం లొ బిడియం, ఎప్పుడు మడత నలగని విస్త్రీ బట్టలు, టక్ తొ సినిమా హీరోలా ఉంటారు. ఆయన పుట్టింది అనకాపల్లి దగ్గిర చిన్న పల్లెటూరులో. తండ్రి మిలటరిలొ పనిచేసేవారు. తల్లి స0రక్షణ లొనే బాలి పెరిగేరు. మీకు బాలి అన్న పేరు ఎలా వచ్చింది అని అడిగితే నా అసలు పేరు శంకర రావు. శంకరరావు పేరు ను "బాలి" గా మర్చింది గురువుగా తలంచే పురాణం సుబ్రమణ్య శర్మగారు. న్యూమరాలజి ప్రకారం నా పేరు "బ" తొ ప్రారంభమైతే మంచిదని పురాణం వారు "బాలి" అని పెట్టారు. భమిడిపా
టి వారు నన్ను నిజమైన మగాడు అనేవారు ఎందుకంటే "బాలిక" అంటే అమ్మాయి, స్త్రీ, మరి "బాలిక" లొ "క" లేదుకాబట్టీ మగాడే కదా అని చమత్కరించారుట. బాలి గారి చిన్నతనంలొనే తండ్రి చనిపొతే తల్లి దగ్గిరే పెరిగారు. మీకు చిత్రకారుడు కావాలనే కోరిక ఎలా కలిగిందని అడిగితే అమ్మ చేతిలోని సుద్దముక్క అలవోకగా ఖచ్చితమైన కొలతలతొ చుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటే నేల మీద మంత్రం వేసి పూలతీగను పరచినంత ఆనందంగా ఉండేది. అదే నాకు స్పూర్తి అంటారు బాలి. చిన్నతనంలొ బాలి వేసిన బొమ్మలను ఆయన తల్లే సరిదిద్దేదిట. తండ్రి కుడా చక్కని చిత్రకారుడే .చిన్నతనంలొ సీనియర్ స్టూడెంట్ కస్తురిరావు దగ్గిర ఇంకు, బ్రష్ లతొ బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. మరి చిత్రకళలో మీకు గురువులెవరైనా ఉన్నరా అంటే చిత్రకళా రంగంలో నాకు గురువులు అంటూ ఎవరూ లేరు అలాగని ఎవరినీ ఇమిటేట్ చేయలేదు.తె
లుగులో అప్పటికే బొమ్మలు వేస్తున్న బాపు దగ్గిరనుండీ తమిళంలో వేస్తున్న గోపులు బొమ్మల నుండి బెంగాలు చితర్ చటర్జీ వరకు అందరి బొమ్మలూ గమనించే వాడిని. సంఘటన తీసుకొని బొమ్మలు వేయడం అనుభవం మీద నేర్చుకున్నాను. చిత్రకళ లొ నాకు ఎప్పుడు పేరు వచ్చిందో నాకు తెలీలేదు. నేను పత్రికలు ప్రచురితమయ్యే విజయవాడ లొ గాని మదరాసులొగాని ఉండి ఉంటే నేను ఇంకా పేరు తెచ్చుకునే వీలు కలిగేది అంటారు బాలి. మరి చిత్రకారుడిగా మీ ప్రస్తానం ఎలా ప్రారంభమయిందని అడిగితే ఈనాడు తెలుగు దిన పత్రిక మొట్ట మొదటి కార్టూనిస్టు నేనే . రామోజీరావుగారు స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకోవడం పెద్ద మలుపు. అందులో ఉన్నప్పుడు అన్ని విభాగాల్లోనూ పని చేసాను. యానిమేషన్ గురించి తెలుసుకున్నది అక్కడే అంటారు. రామాయణ, భారత, భాగవత కధలకు బాలి వేసిన బొమ్మలు చూస్తే కధలలోని ఘట్టాలు మన కనుల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తాయి. ఎన్నో కధలకు బొమ్మలు, నవలలకి ముఖ చిత్రాలు గీసారు.నవ
లల ముఖచిత్రాల గురించి ఒక విషయం చెప్పారు బాలి.ఒక పబ్లిషర్ డెజైన్ విషయమై పిలిచారు. తీరా వెళ్లిన తరువాత నవలలు ముందుగా బాపుగారికి పంపుతాను. ఆయన కాదంటే మీకిస్తానని బేరం పెట్టాడుట. సరే నని బాలిగారు షాపు మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఎప్పటికైన ఆ అల్మారాలలొ నా బొమ్మల కవర్ డిజైన్లతొ నవలలు ఉండకపొవు అనుకున్నరుట. తరువాతి ఆరు నెలల్లొ అదే షాపులొ ఆ చివరినుండి ఈ చివరివరకు బాలి గీసిన ముఖచిత్ర బొమ్మలతొ నిండిపొయాయిట. ఆ విశ్వాసమే ఆయనను ఎన్నొ మెట్లు ఎక్కించింది. నా ఉద్దెశ్యంలొ బాపు తరువాతి స్థానం ఖచ్చితంగా బాలిదే. బాలి గీతలలొ లాలిత్యం, తెలుగుతనం అణువణువునా కనిపిస్తాయి.బాలి బొమ్మలు ప్రతి ఒక్కరికి ఆప్తులుగా దగ్గిర మనుషులుగా కనిపిస్తాయి. కాని బాలిగారికి రావలసింత పేరు రాలేదేమొ అనిపిస్తుంది.మరి చిత్రకారుడిగా ఎలాంటి అనుభవం కలిగిందని అడిగితే బొమ్మలు గీయడంలొ నాకు పరిపూర్ణమైన ఆనందం లభించింది. గొప్ప గుర్తింపులు రాలేదుగాని న్యుజిలాండ్ బైబిల్ సొసైటి వారు నా చేత బొమ్మలు వేయించారు. అలాగే జర్మనీ లొ పర్యావరణం గురించి జరిగిన సదస్సులొ నా బొమ్మలతొ కూడిన పుస్తకాన్ని వె
లువరించారు. గుంటూరు చిత్ర కళాపీఠం వారు నాకు "చిత్రకళా సామ్రాట్" అనే బిరుదుని ఇచ్చారు. ఇవన్నినాకు సంతోషం కలిగించే అంశాలే అంటారు. బాపుగారి గురించి చెపుతూ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభలొ "వంగూరి ఫౌండేషన్" వారు బాలి కార్టూన్ల పుస్తకాని బాపుగారి చేత ఆవిష్కరింప చేసారుట. ఆ పుస్తకాన్ని బాపుగారు తిరగేస్తుంటే " కాస్త ఒపికగా చూడండి సార్" అని బాలి గారంటే, బాపు "బాలీ మీకు తెలీకపొవచ్చు. నేను మీ బొమ్మల అభిమనిని" అన్నారుట . ఇంతకన్నా కాంప్లిమెంట్స్ నాకేం కావలి అంటారు బాలి. మరి మీ కార్టూన్ల గురించిన విషయాలు ఎమిటి అంటే కార్టూన్లు గీస్తున్నానుగాని నవ్వించగల "ఫన్" మాటలలొ పలికించలేక పొతున్ననేమో అనిపిస్తోంది అంటారు. ఆయన అలా అన్నా బాలి కార్టూన్లు నవ్వించలేవు అని అనగల వ్యక్తి ఉండడు
అనడం అతిశయోక్తి కాదు. పత్రికారంగం ఎలా ఉందని అడిగితే "పబ్లిషర్లు పత్రికాధిపతులు లక్షలు పెట్టి పత్రికలు నడుపుతారు. కాని ఆర్టిస్టు దగ్గిరకొచ్చేసరికి సరియైన పారితోషికం ఇవ్వడానికి వారికి మనసొప్పదు.ఈ విధానం మారాలి అంటారు. మరి మీ కుటుంబ విషయాలు చెపుతారా అన్నప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మయి వైశాలి ఒక అబ్బయి గోకుల్. ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు.అమ్మాయికి ఇద్దరు పిల్లలు చరణి, చందు.వీరి పేర్లతోనే నేను కార్టూన్ స్ట్రిప్ గీసాను. మరి మీ ప్రస్తుత కార్యక్రమాలు ఏమిటి అంటే కొత్త పత్రికలు వచ్చేయి వాటికి బొమ్మలు గీస్తున్నాను. బొమ్మలు గీస్తూనే ఉంటాను.అదే నాకు ఆనందం అంటారు. బాలిగారి కార్టూనులతొ మూడు సంకలనాలు వెలువడ్డాయి. బాలి గారి కలం నుండి మరెన్నో అద్భుతాలు జాలువారాలని కొరుకుంటూ.... సమీహ 




సత్యం కంప్యూటర్స్ అధినేత రాజుగారు మొన్నటివరకు ఎందఱో యువకులకు అరాధ్య దైవం. సంస్థ అభివృధికి ఆయన పడ్డ శ్రమ వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఒక ఋషి అనుకొన్నారు. ప్రతి ఒక్కరు ఆయనలా కావాలని కలలు కన్నారు. రాష్ట్రానికే తలమానికంగా దేశానికి ఒక కలికి తురాయిలా సత్యం సంస్థ అభివృద్ది చెందినప్పుడు ప్రతీ ఒక్కరు తామే అభివృద్ధి చెందినట్టు తలంచారు. దేశ విదేశాలలో భారత ఖ్యాతి వ్యాపింపచేసిన సంస్థగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. 108 వాహన సేవలు ప్రారంభించినప్పుడు సత్యం కంప్యూటర్స్ ఒక దేవాలయంగా కనిపించింది. కాని అప్పుడే ఆయనలో మరో మనిషి ప్రవేసించాడని బహుశా ఆయనకికుడా తెలిసుండదు. అప్పుడే ఆయనలో ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించి ఉంటాడు. సంస్థకి ఉన్నమంచి పేరును డబ్బుగా మార్చుకొనే దుర్భుద్ధి కలిగించి ఉంటాడు. సులభంగా కోట్లాది రూపాయాలు సంపాదించే దురాలోచన కలిగించి ఉంటాడు. అప్పటిను౦డే ఆయనలోని సత్యం బహుశా తప్పుకొని ఉంటాడు. సత్యం అసత్యం కాకుండా ఉంటే ఎంత బాగుండేది? ఇదంతా ఒక కలే , నిజం కాదు అని ఎవరినా చెపితే బాగుండేది. ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు. ఒక మంచి మనిషి మహిషిగా మారడం ....... ఒక కల చెదిరింది.
ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణం అంటేనే దడ పుడుతోంది. వైటింగ్ లిస్టు చూస్తుంటే మూర్ఛ వచ్చేట్టు అవుతోంది. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పొడవాటి వైటింగ్ లిస్టే ఉంటోంది. అకస్మాతు గ వచ్చే ప్రయాణాలకి రైళ్ల మీద ఆధారపడటం మరచిపూవటం మేలనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటాని తెలిసిన మిత్రునివద్ద కొద్దిపాటి గూఢచర్యం చేశాను. రైళ్ళలో తత్కాల్ క్రింద ప్రతి రైలులో దాదాపు రెండు వందల పది బెర్తులు రైల్వేవారు ముందే అడ్డుకొని ఆఖరు నిమిషంలో ఎక్కువ ధరకి అమ్ముకొంటున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇవి పోను మిగిలిన టిక్కట్లను రైల్వే సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. వీరు వివిధ పేర్లమీద, వివిధ వయసులతో టిక్కట్లు కొనేసి తమదగ్గారే అట్తెపెట్టుకొంటున్నారు. వీరు ఆ టిక్కట్ట్లను ఏజెన్సీలకు ఎక్కువ రేట్లకు అమ్ముకొంటున్నట్టు విషయ సేకరణలో తేలింది. రద్దీగా ఉండే తేదీలలో టిక్కట్లను వీరు ఎక్కువగా కొని తమ దగ్గర ఉంచుకొని అదనపు సంపాదన చేస్తూ ప్రయాణికులని ఇంక రైల్వే శాఖని మోసగిస్తున్నరు. దీనికి ఒక్కటే మార్గం. ప్రయాణీకులు ఎవరైనాసరే బయట టిక్కట్లు కొనకుండా కేవలం వైటింగ్ లిస్టు టిక్కట్లు మాత్రమె కొని ఊరుకొంటే ఈ వీరి పైత్యం తగ్గుతుంది.
టీవి చానల్స్ లో రికార్డింగ్ డాన్సులు చూసి చూసి విసిగిపోఇన ప్రేక్షకులందరికీ దూరదర్శన్ చక్కని అభి రుచితో కూడిన కార్యక్రమం ప్రసారం చేస్తోంది. అదే మువ్వల సవ్వడి. తెలుగునాట నానాటికీ కనుమరుగవుతున్న సాంప్రదాయక నృత్య కళలని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియచేస్తున్న కార్యక్రమం మువ్వల సవ్వడి. ఈ కార్యక్రమానికి సారధ్యం వహిస్తున్నది దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి యార్లగడ్డ శైలజ. చూడ చక్కని సెట్టింగ్ లో ఒకనాటి సినీ హీరోయిన్ శ్రీమతి ప్రభ ఈ కార్యక్రమానికి సంధాత గ వ్యవహరిస్తుండగా ఎందఱో ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచేస్తున్నారు. రాష్ట్రము నుండే గాకుండా దేశ నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కళాకారులు వస్తున్నారు. దూరదర్శన్ లో ప్రతి ఆదివారం రాత్రి 8.30 ని. కు ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూసి తీరవలసిందే.