2, జనవరి 2009, శుక్రవారం

ధర్మ సందేహాలు

ధర్మ సందేహాలు కార్యక్రమం నిజానికి రేడియో కాన్సెప్ట్. ఉషశ్రీ ధర్మ సందేహాలు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఆదివారాలలో ప్రసారం అవుతున్నప్పుడు ఒకచోట బయలుదేరిన వ్యక్తి ఇంటికి చేరేదాక ఆ కార్యక్రమాన్ని వినేవాళ్ళం. అంటే ఆ విధంగా అన్ని ఇళ్ళల్లో రేడియో లో ఆ కార్యక్రమాన్ని వినే వాళ్ళు. అదే కాన్సెప్ట్ ని దూరదర్శన్ తీసుకొని మరలా ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని పురాణ వాచస్పతి శ్రీ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారితో ప్రారంభించింది. ఈ కార్యక్రమ౦ దూరదర్శన్లో ప్రసారం అవుతున్న మొదటి రోజుల్లో చాల మందికి టెలిఫోన్ లైన్ దొరికేదికాదు. లైన్ దోరకడానికే చాల ప్రయాస పడాల్సి వచ్చేది. చంద్ర శేఖర శాస్త్రి గారి క౦ఠ౦లొని గంభీరత్వం అందరిని మంత్ర ముగ్దుల్నిచేసేది. ఆ తరువాత స్థానం మైలవరపు శ్రీనివాసరావు గారిది. కందడై వారు కూడా ప్రేక్షకులని బాగానే అలరించారు. కొన్ని విషయాలలో దూరదర్శన్ కి ఉండే నిబంధనలు కార్యక్రమాలకి ఆటంకం కలిగేలా ఉన్నాయ్. పదమూడు ఎపిసోడ్స్ మించి ఎవరిని కార్యక్రమాలలో ఉంచకూడదు. దీని వల్ల లబ్ద ప్రతిస్తులైన వారిని కూడా కార్యక్రమాలలో కొనసాగించడం కుదరక కార్యక్రమాలలో వన్నె తగ్గుతోంది. కనీసం ఇటువంటి కార్యక్రమాల కైనా నిబంధనలు సడలించాలి. విషయ పరిజ్ఞ్యానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలి కాని నిభందనలకి కాదు. ఈ విషయంలో దూరదర్శన్ తగు నిర్ణయం తేసుకోవాలి. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ ఆచారాల్ని పాటించటానికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలి.

1 కామెంట్‌: