16, మే 2009, శనివారం

రాజశేఖరుని పాచిక పారింది

జరిగిన ఎన్నికలలో ప్రతీ పార్టీ తెలంగాణా అంశంనుండి లబ్ది పొందాలనే చూసాయి. కర్ర విరగకుండా పాము చావకుండా తమపని కానిచ్చేయాలని అటు (టీఅరెస్‌తో చేరి) తెలుగు దేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణా కోసమే జన్మించిన టీఆరెస్, విభజనకు(మధ్యస్తంగా) సరేనంటూ పీఅర్పి కుడా వంత పాడాయి. కాని ఎన్నికలఫలితాల సరళిని చూస్తే తెలంగాణ సమస్య ప్రజల సమస్య కాదని ఇది కేవలం ఒక రాజకీయ సమస్య మాత్రెమే అనిపిస్తొంది. మొదటినుండి తెలంగాణ విభజనకు సశామీరా అన్నది ఒక్క రాజశెఖర రెడ్డి మాత్రమే. అవినీతి పెరిగిపోయిందని ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకుందామని ప్రయితించిన చంద్ర బాబుకు ఒక్క విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. అదే తెలంగాణా అంశం. ప్రజలో వైయసార్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా తెలంగాణా అంశం విషయంలో ఆయన (చంద్ర బాబు) అంచనాలు తారుమారయ్యాయి. టీఆరెస్‌తో పొత్తే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు అయ్యాక టీఆరెస్ ను కొంత దూరం పెట్టి ఉత్తరాంధ్రలో పర్యటించారు. వాగ్దానాలు గుప్పించారు. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మేరొ లేదో గానీ రాజసేఖర రెడ్డి మాత్రం గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ ఒకే మాట అన్నారు. సమైఖ్య ఆంధ్ర కావాలెంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని. లేకపోతే హైదరాబాదులో విదేశీయుల్లాగ జీవించాలని. హైదరాబాదులో కాలు పెట్టే అవకాశం ఇకముందు అక్కడివారికి ఉండదని. ఆ అంశాన్ని స్పష్టం చెయడంవల్ల ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. పీఆర్పీకి స్థానం లేకుండా చేశాయి. తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ విషయంపై కాంగ్రెస్ లో మిగిలిన తెలంగాణా పెద్దలు గొల్లుమన్నారు. పార్టీ పూర్తిగా బ్రష్టు పడుతుందని డిల్లీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారు. అలా తెలంగాణాను వెనకేసుకొచ్చిన పెద్దలు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడం చూస్తే తెలంగాణా అనేది ప్రజా సమస్య కాదనే విషయం మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాసం వ్రాసే సమయానికి టీఅరెస్ అధినాయకుడు పురిటి నొప్పులు పడుతున్నారు. ఆయన నెగ్గుతారో లేదో కూడ తెలియని పరిస్తితి. ఇక పీఅర్పీ పరిస్తితి చెప్పనక్కర్లేదు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవటం కూడా దీనిని బలపరుస్తొంది. కాబట్టి "రాజశేఖరా నీపై మోజుతీరలేదురా " అని మరో ఐదేళ్ళు పాడుకోవడమే.

15, మే 2009, శుక్రవారం

జ్యొతిష్య శాస్త్రంపై హేతువాదుల చాలెంజ్

ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజేత అవుతుండో చెప్పగలరా అని కలకత్తాలో హేతువాదులు జ్యొతిష్యులను చాలెంజ్ చెసారట. జాతకాలనేవి వ్యక్తులకు ఉంటాయిగానీ పార్టీలకు కాదు. ఈరోజు టీవీలలో కనిపించే జాతక బ్రహ్మ్మలు విషయ పరిజ్గ్యానంకన్న డబ్బు సంపాదనలో పరిజ్గ్యానం ఉన్నవారే ఎక్కువ. నిజమైన పరిజ్గ్యానం ఉన్న వ్యక్తులు వారిచ్చే డబ్బులకు జాతకాలు చెప్పరు. వీరు చేసే బోడి చాలెంజ్‌లకు సరే అనరు. మా వూరిలో (అనగానే కహానీ అనుకోకండి) ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన జీవనం మావూరి సత్రంలోనే. ఆయనను అందరూ సత్రవు వెంకన్న గారూ అనేవారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వ్యక్తి ఆయనకి సమస్య చెప్పనవసరం లేదు. జ్యొతిష్య శాస్త్రం ప్రకారం వచ్చిన వారు ఎవరిగురించి ఏ సమస్యతో వచ్చరో చెప్పి ఆయనే మనం ఎదుర్కొంటున్న సమస్యకి ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పేవాడు. ఆయనకి వొంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప మరేమి కట్టుకోవడానికి కుడా ఉండేది కాదు. సత్రవులో కుటుంబంతో జీవనం. ఆయనదగ్గరకు వెళ్ళినవళ్ళు రూపాయో రెండో ఇస్తే దానితోనె జీవించేవాడు. సరస్వతి కటాక్షం ఉందిగాని లక్ష్మీ కటాక్షం లేదని ఊరిలో అందరూ అనుకొనేవారు. ఇలాంటి విషయాలలో వితండ వాదం చెసేవారిని సమాధాన పరచలేము. జ్యొతిష్యం నిజమైన శాస్త్రం. ఎటొచ్చిదానిలో పూర్తి విషయజ్గ్యానం ఉన్నవాళ్ళు లేరు (తక్కువ). గాలి కంటికి కనిపించదని గాలి లేదని అనడం లాంటిదే జ్యొతిష్య శాస్త్రం కూడ అబద్ధం అనడం. ఇదికూడా హేతువాదులు వారి పబ్లిసిటీకోసం చెసే ఒక తంతు. ఎవరు గెలుస్తారోనని వారి సందేహం తీర్చుకోవాడానికి కుడా కావచ్చు. :)


6, ఏప్రిల్ 2009, సోమవారం

ఎలక్షన్ హామీలు - ఒక కార్టూన్


29, మార్చి 2009, ఆదివారం

మావాడి పరీక్షలు

ఆ రోజు నా మనసంతా అందోళనగా ఉంది. కారణం మా ఆఫీసరు నాకు లీవు ఇస్తాడో లేదో అని. రేపటినుండి మా అబ్బాయి కి పరీక్షలు. వాడిని దగ్గిర కూర్చొని చదివించాలి. వాడికి మంచి రాంక్ రావాలి లేకపోతే తరువాత చాలా ఇబ్బంది పడాలి. మావిడ మరీ మరీ చెప్పింది వాడి పరీక్షలు అయ్యేదాక శలవు పెట్టమని. నెమ్మదిగా లీవు లెటర్ పట్టుకొని మా ఆఫీసరు రూంలోకి వెళ్ళాను. మా ఆఫీసరు ఎప్పటిలాగానే కోపంగా ఏమిటన్నట్టు చూసాడు. నేను నెమ్మదిగా లీవు కావాలని అన్నాను. అదేమటండీ ఇది మార్చి నెల. అక్కౌంట్స్ అన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి కదా. ఇలాటప్పుడు లీవు అంటే ఎలా . అసలే మీది బిల్లుల సీటు. మీరు పాసు చేయ్యల్సిన బిల్లులు కూడా చాలా ఉన్నాయి అన్నాడు. నిజమే సార్, కానీ ఇది మా అబ్బాయి జీవిత సమస్య. మా అబ్బాయి ఫైనల్ ఎగ్జాంస్. నేను వాడితోబాటు ఉండి చదివించాలి. లేకపోతే వాడి భవిష్యత్తు పాడవుతుంది అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మొత్తానికి సరే అని లీవు గ్రాంట్ చేసాడు. అమ్మయ్య పెద్ద సమస్య తీరింది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాను. మా వాడు పుస్తకాలు ముందు వేసుకొని దీర్ఘంగా అలోచిస్తున్నాడు. వాడికి ముందు ఎగ్జాంస్ అంటే భయం పొగొట్టాలని "చూడు నాన్నా పరీక్షలంటే భయపడక్కరలేదు. దానికి తగ్గ ప్రిపరేషన్ మనము చేసుకోవాలి.ఇంతకు ముందు నువ్వు చదివిన సిలబస్ అంతా మరోసారి మననం చేసుకుంటే చాలు. ఏ ప్రశ్న అడిగినా సులువుగా సమాధానం వ్రాయవచ్చు. నువ్వు బాగా చదవాలి, మంచి ఇంజనీరువవ్వాలి. సరేనా? వాడు తల ఊపాడు. మరుసటి రోజు సైన్స్ పేపర్. వాడితోబాటు మేమూ వాడు సిలబస్ అంతా చదివే వరకు మేము కూర్చొని ఉన్నాము. మధ్య మధ్యలో వాడికి హార్లిక్స్ అందిస్తూ ధైర్యం చెపుతూ ఉన్నాము. అలా పన్నెండువరకూ సాగింది. మరీ ఎక్కువసేపు మెలుకవగా ఉంటే పరీక్ష వ్రాయలేడని పడుకొబెట్టాము.మరలా ఉదయాన్నే ఐదు గంటలకు లేపి పరీక్షకు సిద్ధం చేసాం.వాడు ఎగ్జాం వ్రాసి వచ్చేదాకా టెన్షనే. ఎలా వ్రాసేడోనని. వచ్చేక అడిగితే క్వస్చన్ పేపర్ మొహాన పడేసాడు. వాడు పెట్టిన టిక్కులనిబట్టి అన్ని సమాధానలు వ్రాసాడని సంతృప్తి చెందాం . అలా వాడి ఎగ్జాంస్ జరిగినన్ని రోజులూ మాకు నిద్ర ఉండేది కాదు. వాడిదసలే అన్ని విషయాలని తేలికగా తేసుకొనే మనస్తత్వం. వాడికి జీవితం గురించి, భాద్యతలగురించి నేను చెపుతూ ఉండేవాడిని. వాడి ఎగ్జాంస్ పూర్తి అయ్యాయి. ఇక రిజల్ట్ తెలియాలి. నాకు టెన్షన్ మరీ పెరిగిపోతూంటే మావిడ దెబ్బలాడింది "వాడి ఎగ్జాంస్ గురించి మీ ఆరోగ్యం పాడుచేసుకుంటారా ఏమిటి" అని. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. మా వాడిని ఒకటవ తరగతి నుండీ రెండవ తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు స్కూల్‌వాళ్ళు పంపిన లెటర్ చూసేకాగాని నాకు మనసు కుదుట పడలేదు.

26, మార్చి 2009, గురువారం

ఉగాది నవ్వు - ఒక కార్టూన్

తెలుగువారందరూ ఈ సంవత్సరమంతా ఇలాగే నవ్వులు చిందిస్తూ గడపాలని కోరుకుంటూ -
ఉగాది శుభాకాంక్షలతో సమీహ......

24, మార్చి 2009, మంగళవారం

నా ఎక్సరసైజ్ ప్రహసనం

ఆ రోజెందుకో నాకు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చాను. తెల తెలవారుతోంది. చిరు చీకట్లని సూర్య కిరణాలు తరిమే ప్రయత్నం చేస్తున్నాయి. వాతవరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. మాది మా అపార్టుమెంటులో ఐదవ ఫ్లోరు. దూరంగా పచ్చని చెట్లు. కొద్దిపాటి మంచు కురుస్తూ ఉందటం వల్ల ఆకాశం లోని మబ్బులన్ని భూమి మీదకి వచ్చేసినట్లు ఉంది.అదృష్టవశాత్తు మాకు కోయిల అరుపులు కుడా వినిపిస్తూ ఉంటాయి. మా అపార్టుమెంటు పక్కనుండీ నల్లటి తారు రొడ్డు వెడుతుంది. దాని మీద అప్పుడే మనుష్యుల సంచారం మొదలైంది. వారిని కొద్దిగా పరికించి చూస్తేరకరకాల వయస్సులవాళ్ళు వేగంగా నడుస్తూ మార్నింగ్ వాక్ చేసున్నారు. కొందరితోబాటు వారి అర్ధాంగులు కుడా నడుస్తూ కనిపిస్తున్నారు. వారందరికి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో? జీవితంలో ఎంతో కొంత డిసిప్లెన్ లేకపోతే ఇలా ఉదయాన్నే ఎక్సర్సైజులు చేసే క్రమశిక్షణ అలవాటవ్వదు. ఎక్సరసైజులవల్ల ఆరోగ్యంగా ఉండగలగడం, దానివల్ల ఆనందంగా ఉండటం జరుగుతాయి. మనుషులు కూడా ఎంతో నాజూకుగా ఉంటారు. ఒక్కసారి నావైపు చూసుకున్నాను. తిండి మీద అదుపు లేకపోవడంవల్ల పెరిగిన శరీరం, దానికి కల్లు కుండ తగిలించినట్టు పెరిగిన పొట్టా నా మీద నాకే వికారం కలిగింది. నేను కూడ కాస్త ఉదయాన్నే నడిస్తే? ఆరోగ్యం, ఆనందంతొపాటు జీవితం లో క్రమశిక్షణ వస్తాయేమో? ఇవాల్టినుండి నా జీవిత విధానం మార్చుకోవాలని నిర్నయించుకున్నాను. ఇకనుండి చికెన్, మఠన్ తినడం మానేయాలి. సిగరెట్లు, టీలు కుడా మానెయ్యాలి. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం కొద్ది కూరతొ అన్నము తినాలి. రాత్రి రెండు పుల్కాలో లేక రొట్టెలో తిని ఊరుకొవాలి. మరో విషయం రోజూ ఉందయాన్నే టీవీల్లో వచ్చే బాబా రాందేవ్ గారి యోగా నేర్చొకోవాలి. ఆయనలా పొట్టని లోపలికి బైటకి కదపగలిగితే ఈ బాన పొట్ట కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి టీవీ చూడటం కుడా అలవాటు చేసుకోవాలి. ఆ నిర్నయం తీసుకోగానే నేను సన్నగా సంపూర్న అరోగ్యవంతుడిని అయిపొయినట్టు అనుభూతి కలిగింది. నిర్నయం తీసుకున్నందుకే ఇంత ఆరోగ్యం అనిపిస్తే నిజంగా ఎక్సరసైజులు చేస్తే ఇంకెంత అరోగ్యం కలుగుతుందో తలుచుకుంటే సంబరం వేసింది. ఆరోజు ఉందయాన్నే మావిడ ప్లేటులో పెట్టిన డజను ఇడ్లీలనుండీ పది ఇడ్లీలను పక్కన పెట్టేశాను. నెయ్యి కూడ వేసుకోకుండా రెండు ఇడ్లీలు తిని ఆఫీసుకు బయలుదేరేను. ఆఫేసులో ఉత్సాహంగా పని మొదలు పెట్టాను. గంట గడిచింది. పొట్టలో కొద్దిగా తేడాగా అనిపించింది. మరో గంట గడిచింది. పేగులు అరుపులు మొదలు పెట్టేయి. దీనినే ఆకలి అంటారుగాబోలు. కొద్దిసేపటికి మా కొలీగ్ సంబరంగా వచ్చి ఈ రోజు మీ అందరికి హొటల్ పేరడైస్‌లో ట్రీట్ ఇస్తున్నాను మీరందరు తప్పక రావాలని ఆహ్వానించాడు. ఎందుకని అడిగితే మా అబ్బాయికి ప్లేస్‌మెంట్ వచ్చింది అన్నాడు. నేను సందిగ్దంలో పడ్డాను నా ఆరోగ్య నియమాల విషయం తలుచుకొని. ఎలాగైనా అరోగ్యమే ముఖ్యం, మిగిలిన విషయాలకన్నా అనుకొని పార్టీకి వెళ్ళకూడదనే తీర్మానించుకున్నాను. నెమ్మదిగా లంచ్ టైం కావస్తోంది. ఆకలి విపరీతంగా పెరిగింది. నెమ్మదిగా నా కేరేజ్ తెరిచాను. రొజూలా కాకుండా దానిలో బుల్లి కప్పుడు రైస్, కొద్దిగా పొట్లకాయ కూర ఉంది. మామూలుగూ అయితే అది నాకు ఒక్క ఐటం సరిపడా కూడా కాదు. నెమ్మదిగా ఉన్న అన్నాన్నే తిన్నాను. బహుశ నా పొట్టకి భొజనం చేసిన విషయం కుడా తెలిసి ఉండదు. కేరేజ్ మూసి నెమ్మదిగా నా సీట్లొ వాలేను. కొద్దిగా మగత వచ్చింది. మా కొలీగ్ వచ్చి లేపి పద అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ఎక్కడికి అన్నాను నేను. అదేమిటి పేరడైస్‌లొ పార్టీ ఇస్తున్నానని చెప్పేను కదా అన్నాడు. నాకప్పటికే కళ్ళకింద నల్ల మచ్చలతో రోగిష్టిలా తయారయ్యానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నామీద నాకే చాల జాలి కలిగింది. వెధవ జీవితం అన్న భావము కలిగింది. దేముడు తిండికి శరీరానికి ఎందుకు లంకె పెట్టాడో కదా అనిపించింది. ఇలా జీవితం ఎంత కాలం గడపాలో? కానీ ఇప్పుడే భరించడం కష్టంగా ఉంది. ఇక లాభం లేదు, ముందు వాళ్ళతోపాటు హొటల్‌కి వెళ్లి సుష్టుగా భోజనం చేయాలి. అనుకున్నదే తడవు వెంఠనే బయలుదేరేను. హొటల్‌లో రెండు బిర్యానీలు లాగించాకాగానీ మనసు కుదుట పడలేదు. ఆరోజు సాయంత్రం ఇంటికొచ్చి పడక కుర్చీలో పడుకొని ఆలోచించసాగాను. నాకంత వయసు ఏమి అంత మించిపొయిందని, ఇప్పటినుండి ఉపవాసాలు చేయడానికి. నా పొట్ట నాకేవిధంగాను అడ్డుగా లేదు. తిండి మానేసి కడుపు మాడ్చుకుంటూ బాబా రాందేవ్ మాత్రం ఏమి సుఖపడుతున్నడో? ఈ భొజన నియంత్రణలు, వ్యాయామాలు, ఉదయపు నడకలు మరో పదేళ్ళ తరువాత మొదలు పెట్టవచ్చు. కడుపు నిండా నచ్చిన తిండి తినకుండా మరో పదేళ్ళు ఎక్కువ బతికి మాత్రం సుఖమేమి ఉంటుంది? నా నిర్నయం మంచిదే అని మనసులో అనుకున్నాను. చాలా హాయిగా అనిపించింది. రాత్రికి కోడి వేపుడు చేయమని మావిడకి ఉత్సాహంగా ఆర్డరు వేశాను.

9, మార్చి 2009, సోమవారం

"సెల్ ఫోన్ బిల్" - ఒక కార్టూన్


21, ఫిబ్రవరి 2009, శనివారం

తెలుగు బ్లాగ్లోకానికొచ్చిన బుల్లితెర "సాహితీ సౌరభం శ్రీ వోలేటి పార్వతీశం గారు"





తెలుగు సాహితీ ప్రపంచంలొ భావ కవిత్వాన్ని సురభిళ శొభితంగా పరివ్యాపనం చేసిన సుప్రసిద్ధ జంట కవులు వేంకట పార్వతీశం కవులు. జంట కవి లోకంలొ తిరుపతి వేంకట కవులకు సమస్కంధంగా పేరెన్నికగన్న జంట కవులు వేంకట పార్వతీశం కవులు. బాలంత్రపు రజనీకాంతరావు గారి తండ్రియైన భాలాంత్రపు వేంకటరావుగారు, వొలేటి పార్వతీశంగారు కలసి ఈ జంట కవులు.శతాధిక గ్రంధ కర్తలు. వంగ భాషకో రవీంద్రుని గీతాంజలి లాగ, తెలుగు భాషకు ఈ జంట కవుల "ఏకాంత సేవ" ఖండకావ్యం మకుటాయమానమైన రచన. మాతృ మందిరం, బృ౦దావన౦, కావ్య కుసుమావళి, బాలసూర్యవాచకాలు, బాలగీతావళి, బొమ్మల రామాయ౦ ఇలా ఎన్నొ రచనలు వీరివి. వీరిలొ వోలేటి పార్వతీశ౦గారి మనవడే మన వొలేటి పార్వతీశం గారు. జన్మస్థలం అమలాపురమే ఐనా తాతగారి స్వస్థలం పిఠాపుర౦ తొ అనుబంధం ఎక్కువ. తండ్రి ప్రముఖ గేయ కవి శశాంక గారు. ఆయన అసలు పేరు సుబ్బారావు. ఆకాశవాణితొ పరిచయం ఉన్న తెలుగు వాళ్లెవ్వరూ విస్మరించలేని గొప్ప కవి శశాంక. ఆయన తొలి సంతానమే పార్వతీశం గారు.
దూరదర్శన్‌లొ మీ ప్రవేశం ఎలా జరిగిందని ప్రశ్నిస్తే " మా నాన్నగారు శశాంక చాలా చిన్న వయసులోనే పరమపదం చేశారు. అప్పటికి నేను ఇంటర్మీడీయట్ మాత్రమె పూర్తి చేశాను. ఆ తరువాత ఏదొ కష్టపడి బి.యస్‌సి. పూర్తి చేశాను. ఆర్ధిక స్థితి కారణంగానూ, ఇంటికి పెద్దవాడిని కావడంవల్లను మా తాతగారు శ్రీ క౦దుకూరి రామ భద్ర రావుగారి సూచన మేరకు శ్రీ పుల్లెల వేంకటెస్వర్లుగారి సౌజన్యంతో ఆకాశవాణి్‌లొ కాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా తర్ఫీదు పొంది, శ్రావ్య కార్యక్రమాలకు రూప కల్పన చేశేవాడిని. ఉత్తరోత్తరా రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థలో ఉద్యోగంచేసినా ఆకాశవాణిని విడిచిపెట్టలేదు.రేడియో కార్యక్రమాలకు రచన చేయడం, రేడియోలో స్వరాన్ని పలికించడం, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, ఇవన్నీ చెప్పలేనంత సంతోషాన్ని కలిగించేవి. ఆకాశవాణి ప్రాంగణంలో సంగీత సాహిత్యాలలో గొప్ప గొప్ప వారె౦దరితోనో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. శ్రవ్య మాధ్యమాన్ని సుసంపన్నం చేసిన లబ్ద ప్రతిష్టులెందరితోనో పరిచయ భాగ్యం కలిగింది. ఉద్యోగమంటూ చేస్తే ఆకశవాణిలోనే చెయ్యలి అనే ఆశ కోరిక కలిగి కాలం గడిచేకొద్దీ అది బలంగా వెళ్లూనుకుంది. ఆ కోరిక వెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మొత్తానికి సాధించాను. రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగానికి స్వస్థి పలికి, ఆకాశవాణిలో చేరాను.కొంత కాలం కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేశాను. ఆ సమయంలో శ్రీ దేవళ్ల బాలకృష్ణగారు, శ్రీ గొల్లపూడి మారుతీరావు, డా.ఆర్.అనంత పద్మనాభరావుగార్లతో కలసి పనిచేయడం, నాకు ఎన్నొ అనుభూతులని మిగిల్చింది. అక్కడినుండీ బదిలీ మీద హైదరాబాదు దూరదర్శన్‌లో ప్రవేశించాను. ఆ బదిలీ నా వృత్తిగత జీవితంలో పెద్ద మలుపు. శ్రవ్య మాధ్యమంలోంచి నేను దృశ్యమాధ్యమంలోకి ప్రవేశించాను.
చాలా ఏళ్ళ క్రిత౦ మీరు నిర్వహి౦చిన జాబులు జవాబులు కార్యక్రమ౦ ఇప్పటికీ ప్రజల మనసులలొ ఉ౦ది. అటు తరువాత ఆకార్యక్రమాన్ని నిలిపి వేశారు. కారణ౦ ఏమిటి మరలా ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహి౦చే అవకాశం ఉ౦దా అ౦టే"మీరన్న మాట నిజమే. ఇప్పటికీ ఆ కార్యక్రమ౦ ప్రజల మనసుల్లో వు౦ది. ఈ నాటికి అక్కడక్కడ ప్రేక్షకులు "జాబులు-జవాబులు పార్వతీశ౦" అనే పిలుస్తూ౦టారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని టీవీ లొ నిర్వహి౦చడానికి పూర్వ౦ ’మీ ఉత్తరాలు’ పేరుతోరేడియొలో నిర్వహి౦చెవాళ్ల౦. ఉద్త్యొగ౦ లొ చేరిన కొత్త కాబట్టి, ఉత్సాహం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏం చేసినా కొత్తగా చెయ్యాలని అనిపించేది. మామూలుగా రేడియోలో ఏదో వస్తూ ఉంటుంది, మనం ఏదో వింటూ ఉంటాం. ఇలా కాకుండా రేడియో మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది. ఆ అలోచనే మీ ఉత్తరాల కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాను. నేను చేప్పేది ముప్ఫై ఏళ్ల నాటి మాట. శ్రోతలు అనూహ్యంగా స్పందించారు. పదుల సంఖ్యలో ఉత్తరాలు వందలు దాటి వేల సంఖ్యలోకి పెరిగిపోయాయి. ఆ అనుభవంతోటే నేను దూరదర్శన్‌లో జాబులు-జవాబులు కార్యక్రమం నిర్వహించేవణ్ణి. ఏదో ఉత్తరాల కార్యక్రమమేకదా అని తెలిగ్గా తేసుకోలేదు. ప్రసారానికి రెండు మూడు రోజుల ముందునుచే చాల హోం వర్క్ చెసేవాణ్ణి. కార్యక్రమంలో చదవగలిగే పాతిక, ముప్ఫై ఉత్తరాలే ఐనా వచ్చిన వందలాది ఉత్తరాలని మొత్తం చదివేవాడిని. ప్రశంశలకన్నా నిర్మాణాత్మకమైన సూచనలు, విమర్శలు చేసే ఉత్తరాలకి ప్రాధన్యం ఇచ్చేవాణ్ణి.కార్యక్రమం నిర్మించేటప్పుడు వుండే సాధక బాధకాలు వివరించేవాణ్ణి. అలాగే నాకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గొవిందు చౌదరి గారు నిర్వహించే తీరులోనుంచి మెలుకువలు నేర్చుకున్నాను. మొత్తంగా ఇవన్నీ కలిసి, ఈ కార్యక్రమానికి గణనీయమైన ప్రేక్షకాదారణ సంపాదించి పెట్టాయి. ఇక ఆ కార్యక్రమన్ని నిలిపివేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నా తరువాత కొంతమంది ఆ కార్యక్రమన్ని నిర్వహించారు. కారణాలేమైనా, ఆ కార్యక్రమంలో ఆకర్షణ తగ్గింది. అంచేత కాలక్రమంలో అది కనుమరుగైంది. ఇక మళ్లీ నేను నిర్వహించడమనేది బహుశా ఉండకపొవచ్చు. ఎందుకంటే కొత్త నీటికి చోటివ్వాలంటే పాతనీరు ముందుకి ప్రవహించాలికదా!"
పార్వతీశ౦గారికి ప్రత్యేక౦గా అభిమానులున్నారు. వారికి బుల్లితెర మీద కనిపిన్చడ౦ లేదు అ౦టే" నిజమేనండీ! చాలామంది అభిమానులున్నారు. వాళ్లే లేకపొతే, ఈ రోజున ఇలా 'సమీహ ' లో ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశమే లేదుకదా! మూడున్నర దశాబ్దాల పూర్వం నేను ఆకాశవాణిలొ కాజువల్‌గా పనిచేసిన రోజులనుండీ నన్ను శ్రోతలు అభిమానించడం మొదలు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే శ్రోతలు, ప్రేక్షకులు నాపట్ల చూపిన అభిమానమే నన్ను ప్రసార మాధ్యమంలో పనిచేసేలా చేసింది. ఐతే దీనివెనుక దూరదర్శన్‌లో ఎంతోమంది కార్యక్రమ ప్రయోక్తల ప్రోత్సాహం ఉంది. శ్రీ పి.వి.సతీష్, శ్రీమతి రమణి సన్వాల్, శ్రీ పి కె మాన్వి, శ్రీ ఆర్ ఆర్ కె శ్రీ, శ్రీమతి యమునా సంజీవ్,శ్రీమతి శైలజా సుమన్, శ్రీమతి యార్లగడ్డ శైలజ వంటి కార్యక్రమ ప్రయోక్తలు తమవంతు కార్యక్రమలలో నన్ను భాగస్వామిని చేసారు.అలా వారంతా ఇంచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకున్నాననుకుంటాను.ఫలితమే విశేషమైన ప్రేక్షకుల అభిమానం నాకు దొరికింది. ఇక పొతే ఇటీవల బుల్లితెర మీద కనిపించకపోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. తెరముందు జీవితాన్ని తెరవెనుకకు మళ్ళించాను. ఉద్యోగాలలొ ఇవన్ని సాధారణమే."
ప్రస్తుత౦ మీరు చేస్తున్న కార్యక్రమాలేమిటి అ౦టే "ప్రస్తుతం నేను ప్రధానంగా ప్రయోజిత కార్యక్రమాల విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నాను. ఈ విభాగంలో నేనుగా నిర్వహించే కార్యక్రమాలేవీ ఉండవు. బహుశా నేను ప్రేక్షకులకి బొత్తిగా కనిపించకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఐతే 'తెలుగు తోట ' శీర్షికతో సాహిత్య సంచికా కార్యక్రమం ధారావాహికంగా అందించాలని ఒక ఆలోచన."
తెలుగులో చాలా ఛానల్స్ వచ్చాయి. ప్రేక్షకుడు సప్తగిరి వెదికి చూసే కార్యక్రమాలు చేస్తో౦దా అని అడిగితే"టీవీ అంటే దూరదర్శన్ అనే రొజులనుండీ, ఇవాళ చానల్ స్కాన్‌లో దూరదర్శన్ ఎక్కడవుందా అని వెతుక్కునేంతవరకు చానల్స్ సంఖ్య పెరిగిపొయింది. అలాంటి తరుణంలో ఇన్ని చానల్స్ మధ్య ప్రేక్షకులు దూరదర్శన్ వెతికి పట్టుకొనే అవకాశం ఉందా అంటే ఉంది. ఐతే అలా వెదికేవారి సంఖ్య కొంత పలుచన కావచ్చు. నిజానికి దూరదర్శన్ information,education and entertainment.వాటి ప్రాధాన్యతా క్రమం కూడా అదే. మొదటి అంశానికి విస్తృతంగా చానల్స్ వచ్చాయి. అలాగే చివరికి అంశానికి కొరత లేదు. ఇక మిగిలందల్ల మధ్యలో వున్నది. అదే దూరదర్శన్‌కి గొప్ప ఆసరా. మన సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, నాట్య కళల పట్ల, ఇతర లలిత కళలపట్ల, విద్య పట్ల, వ్యవసాయంపట్ల ఆసక్తి కలిగించే ప్రయత్నం దూరదర్శన్ మాత్రమే చేయగలుగుతుంది. మంచి కవితా గానాలను అస్వాదించాలంటే, ఉత్తమ శ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలను వినాలంటే దూరదర్శన్‌లోనే సాధ్యమవుతుంది. అష్టావధానాలు, పద్యాల తోరణాలు, తెలుగు పద్యం అంద చందాలు, ఇలాంటి కార్యక్రమాలకోసం ప్రేక్షకులు దూరదర్శన్ వెదికి పట్టుకోవలసిందే." తెలుగు భాషాభివృద్ధి కోస౦ ఈ-తెలుగు లా౦టి స్వచ్హ౦ద స౦స్థలు పనిచేస్తున్నాయి.వాటికి మీరు సహకరి౦చగలరా? మన భాషాభివృధ్ధి కోసం ఈ వ్యవస్థలో చాలా మంది వ్యక్తులు, సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని పత్రికలు కూడా విశేష కృషి చేస్తున్నాయి. ఇలాంటి కృషిలో భాగమే ఈ-తెలుగు కుడా. ఇది ప్రశంసార్హమైన విషయం. మన తెలుగు భాషభివృధ్ది ఇంకా పటిష్టంగా వుండాలంటే సంస్థలు, వ్యక్తుల మధ్య ఒక సమన్వయం కావాలి. ఒక సరియైన అవగాహన, కలిసిగట్టుగా పనిచేయగలగాలి. నేను ఇప్పటికే చాలా భాషా సంభంధమైన సంస్థలలో భాగస్వామిగా ఉన్నాను. ఈ-తెలుగు కూడా తన కృషిలో నా భాగస్వామ్యం అవసరమనుకుంటే, నేను అందించాడానికి సిద్ధంగానే ఉన్నాను.
కుటు౦బ విషయాలగురి౦చి అడిగినప్పుడు "నేను చాలా రకాలుగా అదృష్టవంతుడిని. ఆ అదృష్టంతొపాటు దురదృష్టం కుడా వెన్నంటే వుందని అర్ధమైంది. మా నాన్న గారు శశాంక చాల చిన్న వయస్సులోనే పరమపదం చేశారు. మా కుటుంబంలో ఒక దీప స్థంబంలా నిలిచిన మా అమ్మగారు శ్రీమతి హైమావతి కుడా నడివయస్సునాటికే పరమపదం చేశారు. అలాగే మా తమ్ముడు రామభద్రరావు నడివయస్సుకుడా చేరకముందే నాలుగు పదుల వయస్సులో మా అమ్మని నాన్నని అనుసరించాడు. ఇక అన్నిటికి మించిన దురదృష్టం నా శ్రేమతి వోలేటి కృష్ణకుమారి ఇటేవలే ఒక సంవత్సరం క్రితం అకస్మాత్తుగా కన్నుమూసింది. ఆమె అకాల మరణం జీవితం నిర్వీర్యం ఐనట్లుకనిపిస్తోంది. నా ప్రసార మాధ్యమ జీవితంలో వీరిద్దరిదీ చాలా కీలకమైన భూమిక. ఆ ఇద్దరూ నిష్క్రమించడం, జీర్నించనలవికాని దురదృష్టం. ఇక ప్రస్తుతం నేనూ, మా ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు శశాంక, మా నన్నగారి పేరే. బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్నడు. రెండవవాడు హేమంత్. మా అమ్మగారి పేరు హైమావతి కావడం, ఈ పిల్లవాడు మగపిల్లవాడు కావడంవల్ల ఆ పేరు పెట్టే అవకాశం లేక హేమంత్ అని పేరు పెట్టాను. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నవయస్సులొనే కష్టాలు ఎదురొచ్చినా చాలా పరిణత మనస్కులై వ్యవహరిస్తారు. అది భగవంతుడు వారికిచ్చిన వరమే. చివరిగా ఒక్క మాట చెప్పాలి. మూడున్నర దశాబ్దాల క్రితం మా అమ్మగారి కోరిక ఒకటి తీర్చాలని ఇటీవలే నెరవేర్చాను. యార్లగడ్డ బాల గంగాధరరావు గారి సౌజన్యంతో తెలుగులో నామవిగ్జ్యాన శాఖలో ఒక పరిశొధన పూర్తి చేశాను. ఆ సిద్ధాంత వ్యాసాన్ని బెర్హంపూర్ విశ్వ విద్యాలయం వారికి పి.హెచ్.డి. పట్టా కోసం సమర్పించాను. ఆ లాంచనాలన్ని ఇటీవలే ముగిశాయి. అదృష్టం ఆలంబనగా నాకు సంక్రమించిన ఈ పేరు ముందు ఇప్పుడు ఒక అక్షరం వచ్చి చేరనుంది. అదే డా. (డాక్టరేట్)"


జీవితాలని అందమైన గులాబి తొ పోలుస్తారు కవులు. ఎ౦దుకో ఇప్పుదు అర్ధమై౦ది. ఎ౦తొ అ౦దమైన రూప౦,చక్కని గుభాళి౦పు మాత్రమే మనము చూస్తాము. కానీ దానికున్న ముళ్లు మనకు కనబడవు. జీవిత౦ కూడా అలా౦టిదే.
పార్వతీశ౦ గారికి అ భగవ౦తుడు మనస్థైర్యాన్ని ఇవ్వాలని, పార్వతీశ౦గారు చక్కని కార్యక్రమాలుప్రేక్షకులకు అ౦ది౦చాలని మనసారా కొరుకుంటూ ... సమీహ.

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ముసలి హీరో గ్లామర్ - ఒక కార్టూన్


19, ఫిబ్రవరి 2009, గురువారం

అమ్మో ఎఫ్ఫెం రేడియో

ఆ రోజు ఆదివారం. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు. కారు నెమ్మదిగా నడుపుతున్నాను. మా బావ మరిది బెంగుళూరు నుండి వస్తున్నాడు. వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. చల్లని గాలి మొహానికి తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంది. నెమ్మదిగా కారులోని పాటల పెట్టెలో ఎఫ్ఫెం రేడియో ట్యూన్ చేశాను. ఎవరో యాంకర్ చాల హుషారుగా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో చెపుతోంది. పక్కవాళ్ళ కోసం బ్రతకకుండా మనకోస౦ మనం జీవించాలని తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపిన భాషలలో చెపుతోంది. మధ్యలో చెప్పడం ఆపి కాలర్ సిధ్ధంగా ఉన్నారు ముందు ఫోన్ చూద్దాం అంటూ ఫోన్ బటన్ నొక్కింది.
యాంకర్: హలో ! గుడ్ మార్నింగ్
అవతలి వ్యక్తి: గుడ్ మార్నింగ్
యాంకర్: మీ పేరు ?
వ్యక్తి: గురుతు పట్టలే?
యాంకర్: ( వయ్యారంగా) లేదు కదా !
వ్యక్తి: మరి గొంతును బట్టి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పేస్తా అంటావ్?
యాంకర్: నీ లాటి గొంతులే ముగ్గురికుంటై
వ్యక్తి: మరి పేర్లు చేప్పుకో
యాంకర్: సుధీర్ ?
వ్యక్తి: కాదు కదా?
యాంకర్: రాకేశ్?
వ్యక్తి: కాదు
యాంకర్: పోనీ నీ పేరులోని మొదటి అక్షరం చెప్పు నేను పేరు చెప్పేస్తా
వ్యక్తి: వి
యాంకర్: ఆ దొరికిపోయావ్ విజయ్
విజయ్: అబ్బో బాగానే పట్టవు
యాంకర్: హాయ్ విజయ్ హౌ ఆర్ యు?
విజయ్: ఫైన్. నువ్వెట్లా ఉన్నావ్?
యాంకర్: నేను బాగానే ఉన్నాను విజయ్ . అవును నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది?
విజయ్: అదా అస్తమాను సతాఇస్తాది. నా వైపే చూడట్లే
యాంకర్: అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవాలి బాబు. కొత్త అమ్మాయి మరొకరిని పటాయించు.
విజయ్: నువ్వట్లే చెపుతావు. నీ ఫోన్ నంబెర్ చెప్ప రాదు?
యాంకర్: ఏఁ నన్ను పటాయిస్తావ? (నువ్వుతూ)
విజయ్: లేదు కొద్దిగా ట్రై చేస్తా
యాంకర్: అబ్బ ఆశ. విజయ్ నీకో క్లూ ఇస్తాను అమ్మాయిలని ఎలా కన్విన్స్ చేయాలో. అది ఫాలో అయిపో.
విజయ్: ఆ చెప్పు.
యాంకర్: మంచి గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయి కి కనిపించాలా దూరంగా తిరుగుతూ ఉండు. కొన్ని రోజులకి ఆ అమ్మాయి తప్పక నువ్వంటే ఇష్టపడుతుంది. సరేనా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు?
విజయ్: సమ్పంగి
యాంకర్: ముద్దుపేరా?
విజయ్: అవును.
యాంకర్: అసలు పేరు?
విజయ్: అమ్మో చెప్పను. అందరికి తెలిసి పోతుంది
యాంకర్: ఆమె ఏఁ చేస్తూ ఉంటుంది?
విజయ్: మా క్లాస్మేటు
యాంకర్: ఇక నేను చెప్పినట్లు చేస్తూ ఉండు విజయ్. బెస్ట్ అఫ్ లక్
విజయ్: ఇక నుండి మీ స్టూడియో దగ్గిర కూడా తిరుగుతూ ఉంటాను.
యాంకర్: విజయ్ నువ్వు చాల ఖతర్నాక్ . ఓకే విజయ్ థాంక్స్ ఫర్ కాలింగ్. బై బై
రేడియో స్విచ్ ఆఫ్ చేశాను. అదీ మాటర్. మనం అన్ని రంగాల్లో చాల ముందు ఉన్నాము. అమ్మాయిలని ఎలా ట్రాప్ చేయాలో కౌన్సలింగ్ కూడా ఇస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త !!

18, ఫిబ్రవరి 2009, బుధవారం

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

సమానత్వం పై ఒక కార్టూన్


16, ఫిబ్రవరి 2009, సోమవారం

మొహమాటపు కార్టూన్




15, ఫిబ్రవరి 2009, ఆదివారం

ఒక సరదా కార్టూన్


"మువ్వల సవ్వడి శైలజ" గారి తో పరిచయం

దూరదర్శన్ సప్తగిరి లొ మువ్వల సవ్వళ్ళు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండీ కళాకారులు ఈ కార్యక్రమంలొ పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నరంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత చెప్పకనే చెపుతోంది. కూచిపుడి భరతనాట్యం లాటి సాంప్రదాయ నృత్యాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం విశెషంగా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం నంది అవార్డును కూడా అందుకుందీ అంటే ఆ ఖ్యాతి పూర్తిగా కార్యక్రమ నిర్మాత శ్రీమతి యార్లగడ్డ శైలజ గారిదే. శ్రీమతి యార్లగడ్డ శైలజ గారితొ పరిచయాన్ని సగర్వంగా సమర్పి స్తోంది సమీహ.
విజయవాడ నుండి తెనాలి వెళ్లే దారిలొ పచ్చని చెట్లు, బకింగ్ హొం కెనాల్ ప్రక్కన సారవంతమైన మెట్ట భూములున్న చిన్న అందమైన పల్లెటూరు గుడివాడ. అదే శైలజ గారి స్వగ్రామం. తండ్రి పిన్నక వేంకటేశ్వరరావు గారు ఆరోజుల్లొనే బిఎ.బియిడి చేసిన గ్రేడ్-1 తెలుగు పండిట్. నలుగురు అక్కచెళ్లెళ్లలలో శైలజ గారు చిన్న. ఒక అన్న గారు. అందరూ ఉన్నత విద్యలు అభ్యసించినవారే. తండ్రి ప్రభావం శైలజ గారి మీద చాలా ఉంది. తండ్రి యొక్క సాహితీ పాండిత్యం, తల్లి నుండి సంగీతాభిలాష శైలజ గారికి వచ్చాయి. త్రిపురనేని, నార్ల, విశ్వనాధ సత్యన్నారాయణ, ఇంకా ఇనేక బెంగాలీ నవలలు తండ్రి లైబ్రరీలో ఉండేవిట. వాటిని చదవమని శైలజ గారిని తండ్రి ప్రొత్సహించేవారుట. ఆడపిల్లలకు చదువులు చెప్పించని ఆ రోజులలోనే తండ్రి ఉన్నత భావాలవాలతొ ఆడపిల్లలని గుంటూరు మహిళా కళాశాలలొ చేర్పించారు. సాంఘీక సమానతలు అక్షరాలా పాటించే శైలజ గారి తండ్రి రచయిత, దర్శకులే కాక మంచి ఆదర్శ ఉపాధ్యాయులు కూడా.తండ్రి నుంచి అవే లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు శైలజగారు.


దూరదర్శన్ లో మీ ప్రవేశం ఎలా జరిగిందని అడిగినప్పుడు " బి.ఎస్.సి(హొం సైన్స్) చేశాకా తెలుగు భాష మీద అభిమానంతొ భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్ లొ ఎం.ఏ తెలుగు చేసాను. బాపట్ల రైతు శిక్షణా కేంద్రంలో డిమాన్స్ట్రేటర్ గా ఉద్యోగం వచ్చింది. మహిళా రైతులకు, రైతులకు పోషకాహారం గృహ విజ్గ్యానం గురించి వివరించడం. కాని కొద్దిగా అసంతౄప్తి. ఎక్కడ సాహితీ కార్యక్రమాలు జరుగుతున్నా వెడుతూ ఉండేదానిని. కొన్ని రేడియో కార్యక్రమాలలొ కూడా పాల్గొన్నాను. అలాంటి సమయంలొనే దూరదర్శన్ లొ ప్రొడ్యూసరు ఖాళీ కి దరఖాస్తు చేయడం ఆ ఉద్యోగం నాకు రావడం జరిగింది.రేడియో లాంటి సంస్థే దూరదర్శన్ కూడా కాబట్టి నేను దీనిలోచేరడం జరిగింది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లొ శిక్షణ పూర్తయ్యాకా నాకు ఎంతో ఇష్టమైన సంస్థలోకి వచ్చిన అనుభూతి కలిగింది. "

మీ కార్యక్రమం మువ్వల సవ్వడి చప్పుళ్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి విశేషాలేమిటి అంటే " మువ్వల సవ్వడి ... నిజానికి 24 సంవత్సరాల నా ఉద్యోగ విధులలో కొన్ని వందల కార్యక్రమాలకు నేను దర్శకత్వం వహించినా, మరెన్నొ కార్యక్రమాలు అవార్డులు తెచ్చిపెట్టినా ఇంత పేరు ప్రఖ్యాతులు మరే కార్యక్రమానికీ నాకు రాలేదని మనస్పూర్తిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇది శాస్త్రీయ నృత్యానికి సంభంధించిన ఒక చక్కని కాన్సెప్ట్ . అందుచేత దేశ విదేశాలలోని ప్రేక్షకులు ఆదరించారు. ఇంత స్పందన నేనుకూడా ఊహించనిది. మనిషికి శ్వాశ ఎంత అవసరమో ఒక జాతికి సంస్కృతి అంత అవసరం. అటువంటి సంస్కృతిని పెంపొందించేవి లలిత కళలు. ప్రపంచ చిత్ర పటంలో మన నాట్యానికి సమున్నతమైన స్థానం ఉంది. ఎంతో క్లిష్టమైన సకల కళల సమాహారమైన నాట్య కళకు ప్రాచుర్యాన్ని నాట్యశాశ్త్రం పట్ల సామాన్య ప్రేక్షకులకు కూడా అవగాహన కలిపించాలి.ఎంతో మంది యువ కళాకారులలొ ఉన్న నాట్య ప్రతిభను వెలికి తీయాలి అనే సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంత ఆదరణ పొందుతోందంటే సమాజంలో మన సంస్కృతిపట్ల ఉన్న ఆరాధన, నాట్యశాస్త్రం పట్ల ఉన్న అభిమానం ఆ నటరాజస్వామికి నీరాజనంగా అర్పిస్తున్నారు. నాట్య కళగురించిన విషయాలు, నాట్య కళకు తమ జీవితాల్ని ధార పోసిన మహానుభావులగురించి కుడా ఈ కార్యక్రమంలో చెపుతున్నాము."
ముందుగా ఈ కార్యక్రమానికి ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీమతి శొభానాయుడును యాంకరుగా నిర్నయించారుట. ఆమెను సంప్రదించి కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ వివరించడం, ఆమె అంగీకారం ఐనతరువాతి రోజు ఆవిడ అదే కాన్సెప్ట్ తొ మరొక చానల్ లొకార్యక్రమాన్ని ప్రారంభించి విస్మయ పరిచేరుట. ఔరా!! కళా తపస్వి విశ్వనాధ్ గారు, సినారే, నాగేశ్వరరావుగారు, రోజారాణీ, కవిత ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమం చూసిన విశ్వనాధ్‌గారు "వచ్చే జన్మలో ఆడపిల్లనై పుట్టి మువ్వల సవ్వడిలో నాట్యం చేయాలని ఉంది" అన్నారుట. దూరదర్శన్‌లో కార్యక్రమ నిర్మాణానికి ప్రొడ్యూసర్లకు పరిమితులేమైన ఉన్నాయా అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక భాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా మా పరిమితులేమిటొ మాకు తెలుసు. కుటుంబానికి ముఖ్యంగా డ్రాయింగ్ రూములొ ప్రధానమైన టీవిద్వారా కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి వీక్షించగల కార్యక్రమాలు రూపొందించడానికి దూరదర్శన్‌లొ స్వేచ్హ ఎప్పుడూ ఉంటుంది. వివిధ చానళ్ల హోరులో కూడా దూరదర్శన్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి వివిధ కార్యక్రమాల రూపకల్పనలో ప్రొత్సహించే మా డైరక్టర్ డా.పాలకుర్తి మధుసూదన రావుగారికి, ప్రతీ ఒక్కరికీ నా కృతజ్గ్నతలు తెలుపుకోవాలి అన్నారు శైలజ గారు. దూరదర్శన్ మరింత ప్రేక్షకాదరణ పొందాలంటే ఏమి చేయాలని ప్రశ్నిస్తే " దూరదర్శన్‌కి ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుంది. సాహిత్యం, సంగీతం, వ్యవసాయం, జానపద కళారూపాలు, క్రీడలు, వంటివి అందిస్తున్నా యువత అభిరుచిననుసరించి కొత్త కార్యక్రమాలు రావాలి. గొప్ప గొప్ప సెట్టింగ్స్, ఆర్భాటాలు, హంగామా లేకున్నా కార్యక్రమాలని రూపొందించేవారికి ప్రభుత్వ పరంగా ప్రొత్సాహాకాలు అందించాలి ". మరి ఇతర కార్యక్రమ వివరాలు ఏమిటి అంటే మువ్వల సవ్వడిలో రెలిటివ్ స్పెషల్స్ మరింత ఆదరణ సాధించుకుంటే మారాకు తొడిగిన్ చిరుమువ్వల సవ్వడి ఇటీవల హైదరాబాదు విజయవాడల్లో సెలక్షన్లు జరిగాయి. ఇది మూసకట్టు కార్యక్రమమలా కాకుండా ప్రేక్షకులను మరింత దగ్గిరగా చేర్చుకుంటోంది. అలాగే శాశ్త్రీయ సంగీతం ఇతివృత్తంతో గాన గాంధర్వం, విన్నుత్న ప్రక్రియలో రైతే రాజు కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు శైలజ గారు. కార్యక్రమ నిర్మాణం అనేది కుడా ఒక కళ. ఆ కళలొ మీరు ఎంతవరకూసఫలీకృతం అయ్యారని మీరు అనుకుంటున్నారు అని అడిగితే నాకొచ్చిన పురస్కారాలే నేనెంత వరకు సఫలీకృతం అయ్యానో చెపుతాయి. 1984, 1985 సంవత్సరాలలొ రెండు సార్లు నంది అవార్డులు వచ్చాయి. రెండుసార్లు దూరదర్శన్ నేషనల్ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ భాషా పురస్కారం అవార్డు వచ్చింది.మువ్వల సవ్వడి్‌కి ఈ సంవత్సరం మరల నంది అవార్దు వచ్చింది.సిఎమెస్, న్యూ ఢిల్లీ నుండి అవార్డు వచ్చింది. ఇంకా స్వచ్చంద సంస్థలు అందించిన అవార్డులు ఎన్నో. మరి మీ కుటుంబ విషయాలేమిటి కుటుంబ పరంగా ఎలాంటి సహకారం లభిస్తోందని అడిగితే నా భర్త పేరు యార్లగడ్డ కుటుంబరావు. నాకొక కుమార్తె చిరంజీవి శరద్యుతి.మావారు మంచి సంస్కారి. వృత్తిపరంగా ఎనలిస్టిక్ కెమిస్ట్. ఆయన ప్రొత్సాహం లెకుంటే నేను కొన్ని వందల కార్యక్రమాలు రూపొందించగలిగేదానిని కాదు. పగలనకా రాత్రనకా రికార్డింగులు, ఎడిటింగులు చేస్తూ పోతున్నా ఏనాడూ పెదవి విప్పి ఒక పొల్లు మాట అనని మనిషి. ప్రతీ క్షణం నన్ను ప్రొత్సహిస్తూ నాకు ఒక గుర్తింపు రావాలని తపించే నా భర్త, అత్తవారింటి వైపునుండీ వచ్చే అప్యాయతానురాగాలూ ఈ జన్మకివి చాలు అనిపిస్తుంది. నా కూతురు శరద్యుతి భగవంతుడు నాకిచ్చిన ఒక వరం. నేను నేర్చుకోలేనివి ఏవైనా తనద్వారా తీర్చుకోవాలని ఎంతో ఆశ. గత ఆరు సంవత్సారాలుగా భరత నాట్యం నేర్చుకుంటోంది. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్‌లొ చదువుకుంటోంది. నేను తనకోసం కాక ఆఫీసుకు కష్టపడుతూంటే చూసి ఆనందించేంత పెద్ద మనసున్న చిన్న తల్లి అన్నారు శైలజ గారు. ఎన్నొ అవార్డులు సొంతం చేసుకుని, ఒక ప్రభుత్వ సంస్థలొ అసిస్టంట్ డైరక్టర్ హోదాలో ఉన్న మహిళ తన భర్త, కూతురు విషయం వచ్చేసరికి ఒక ఇల్లాలిగా ఒక మాతృమూర్తిగా స్పందిచడం.......... ఇదే భారతీయ స్త్రీలు కుటుంబానికి ఇచ్చే గౌరవం... ఇది వారి గొప్పదనం. శైలజగారు మరెన్నొ ప్రేక్షకాదరణ పొందే కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ.....అభినందనలతో సమీహ ..

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ప్రముఖ చిత్రకారుడు "బాలి"తో కబుర్లు - రె౦డవ భాగ౦

(బాలిగారితొ కబుర్లు గత వార౦ కొన్ని సా౦కేతిక కారణాలవల్ల కుది౦చవలసి వచ్చి౦ది. ఆయన, బ్లాగులొ ప్రచురణ నిమిత్త౦ ఇచ్చిన బొమ్మలు కూడా పూర్తిగా ఉ౦చడ౦ కుదరలేదు.ఇక్కడ మిగిలిన భాగాన్నివ్రాస్తున్నాను )
కళల గురి౦చి మాట్లాడుతు బాలి ఒక జోకు చెప్పేరు.గురువు దగ్గిర విద్యను పూర్తి చేసుకున్న ఒక శిష్యుడు ఇరవై స౦వత్సరాలు తపస్సు చేసి నీటి మీద నడవడ౦ నేర్చుకున్నడుట. గురువు దగ్గిరకొచ్చి గురువర్యా నేను తపశ్శక్తితొ నీటి మీదనడవడ౦ నేర్చుకున్నాను. ఈ నది ఆవలి వడ్డు కి ఇప్పుడు నేను సులువుగా వెళ్లిపోగలను అని చెప్పాడుట. దానికి గురువు ఓరి నీ మొహ౦ మ౦డా! ఇదు నిమిషాలలొ పడవలో వెళ్లిపోయే పనికి ఇరవై స౦వత్సరాలు వృధా ఛేసావుకదా అని తిట్టి ప౦పి౦చాడుట. చేసినపనికి, నేర్చుకున్న కళకి సార్ధక౦ ఉ౦డాలి. పలువురు మెచ్చాలి అన్నది నా ఉద్దేశ్య౦ అన్నారు బాలి. బాలి బొమ్మలు తెలుగు సా౦ప్రదాయాన్ని పల్లె వాతావరణాన్నిచక్కగా ప్రతిబి౦బిస్తాయి.ఆయన పెరిగిన వాతావరణ౦ కూడా అలాటిదే. "మా అమ్మ పేరు అన్నపూర్ణ, నాన్న పేరు లక్శణరావు. అమ్మ చక్కగా పాడేది. రాత్రిపూట ఆ౦జనేయ ద౦డక౦ మొత్త౦ చదివి ఇక పడుకో౦డి. తెల్లవార్లూ ఆ౦జనేయుడు మన చుట్టూ తిరుగుతూ మనకి కాపలా ఉ౦టాడు, దెయ్య౦వచ్చినా దొ౦గోడు వచ్చినా చ౦పేస్తాడు అని అనేది. మే౦ ప్రొద్దుట లేస్తూనే రాత్రి ఆ౦జనేయుడు వచ్చడా అని ఆడిగేవాళ్ల౦. ఈ రాత్రి మీకు చూపిస్తాలే అని అమ్మ అనేది. అవి రె౦డొ ప్రప౦చ యుద్ద౦ చివరి రోజులు.మా నాన్న మిలటరీ లోనే కదా ఉద్యోగ౦. మా అమ్మ , మాకు ధైర్య౦ చెపుతూ తాను ధైర్య౦ పొ౦దేది. మా నాన్న ను౦డి ఉత్తరాలు వచ్చేవి. ఇటలీ, సి౦గపూర్ ల ను౦డి వచ్చేవి. కొన్నాళ్లకు మా నాన్నగారు ఊటీ లోని వెల్లి౦గ్టన్ తీసుకువెళ్లి పోయారు. అక్కడ మరో స౦త్సరానికి మా నన్నగారు చనిపోయారు. మళ్లీ మేము అనకాపల్లిలోని మా మామయ్య ఇ౦టికి వచ్చేసాము. మా అమ్మ దుఖ్ఖ్హ౦తో మా నాన్నకుస౦భ౦ధి౦చిన మిలిటరీ పెట్టెలని ఒక పన్నె౦డేళ్లపాటు తెరవలేదు. దానిలొ మిలటరీ ఉన్ని బట్టలు, ఫొటోలు కాగితాలు పెన్నుఉన్నాయి. ఇవి కాక అరలో చైనా రన్గు కేకు, బ్రష్ లు ఉన్నాయి. ఇ౦కా ఒక పైయిటి౦గు ఉన్నాయి. దానిలోచెట్లూ, కొ౦డలూ, అడవులూ, సన్నని బాటలో సైకిలు తొక్కుతున్న వ్యక్తి ఉన్నాయి. ఇవన్నీ నాలోపరోక్ష౦గా బీజాలు నాటాయి. ఇ౦తలో ప్రభుత్వ ఉద్యోగ౦ వచ్చి౦ది. జీవన బృతికి తప్పదుకదా!ఉద్యోగ౦ చేస్తూ౦డగానే ఆ౦ధ్రజ్యోతి విజయవాడ ను౦డీ పిలుపు వచ్చి౦ది. శ౦కర్రావు పేరు బాలి గా మారడ౦మిగిలి౦ది మీకు తెలిసి౦దే. బొమ్మలు వేయడ౦లో నాకు పరిపూర్ణమైన ఆన౦ద౦ విజయ౦ లభి౦చాయి.
బాలిగారికి ధన్యవాదాలతో సమీహ ....... ...

5, ఫిబ్రవరి 2009, గురువారం

ప్రముఖ చిత్రకారుడు "బాలి" తో కబుర్లు



సమీహ బ్లాగుకోసం మీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇంటికి రండీ అని పిలిచారు బాలి. ఒక సాయంవేళ సికిందరాబాదు సీతఫల్మండీ లోని వారి ఫ్లాటుకి వెళ్లాను.తలుపు తెరిచి సాదరంగా అహ్వానించారు. చిత్రకారుడి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారి ఫ్లాటు. కుర్చీలో అసీనులయ్యకా సుభ్రపరచిన ద్రాక్ష పళ్లని ప్లేటు నిండా ఉంచి తీసుకువచ్చారు. వాటిని తింటూ మా కబుర్లు ప్రారంభించాము. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను మొదటి సారి బాలిగారిని కలిసేను. తెల్లని ఛాయ , నల్లని(?) ఒత్తైన జుట్టూ , ఒత్తైన మీస కట్టూ , మొహం లొ బిడియం, ఎప్పుడు మడత నలగని విస్త్రీ బట్టలు, టక్ తొ సినిమా హీరోలా ఉంటారు. ఆయన పుట్టింది అనకాపల్లి దగ్గిర చిన్న పల్లెటూరులో. తండ్రి మిలటరిలొ పనిచేసేవారు. తల్లి స0రక్షణ లొనే బాలి పెరిగేరు. మీకు బాలి అన్న పేరు ఎలా వచ్చింది అని అడిగితే నా అసలు పేరు శంకర రావు. శంకరరావు పేరు ను "బాలి" గా మర్చింది గురువుగా తలంచే పురాణం సుబ్రమణ్య శర్మగారు. న్యూమరాలజి ప్రకారం నా పేరు "బ" తొ ప్రారంభమైతే మంచిదని పురాణం వారు "బాలి" అని పెట్టారు. భమిడిపాటి వారు నన్ను నిజమైన మగాడు అనేవారు ఎందుకంటే "బాలిక" అంటే అమ్మాయి, స్త్రీ, మరి "బాలిక" లొ "క" లేదుకాబట్టీ మగాడే కదా అని చమత్కరించారుట. బాలి గారి చిన్నతనంలొనే తండ్రి చనిపొతే తల్లి దగ్గిరే పెరిగారు. మీకు చిత్రకారుడు కావాలనే కోరిక ఎలా కలిగిందని అడిగితే అమ్మ చేతిలోని సుద్దముక్క అలవోకగా ఖచ్చితమైన కొలతలతొ చుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటే నేల మీద మంత్రం వేసి పూలతీగను పరచినంత ఆనందంగా ఉండేది. అదే నాకు స్పూర్తి అంటారు బాలి. చిన్నతనంలొ బాలి వేసిన బొమ్మలను ఆయన తల్లే సరిదిద్దేదిట. తండ్రి కుడా చక్కని చిత్రకారుడే .చిన్నతనంలొ సీనియర్ స్టూడెంట్ కస్తురిరావు దగ్గిర ఇంకు, బ్రష్ లతొ బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. మరి చిత్రకళలో మీకు గురువులెవరైనా ఉన్నరా అంటే చిత్రకళా రంగంలో నాకు గురువులు అంటూ ఎవరూ లేరు అలాగని ఎవరినీ ఇమిటేట్ చేయలేదు.తెలుగులో అప్పటికే బొమ్మలు వేస్తున్న బాపు దగ్గిరనుండీ తమిళంలో వేస్తున్న గోపులు బొమ్మల నుండి బెంగాలు చితర్ చటర్జీ వరకు అందరి బొమ్మలూ గమనించే వాడిని. సంఘటన తీసుకొని బొమ్మలు వేయడం అనుభవం మీద నేర్చుకున్నాను. చిత్రకళ లొ నాకు ఎప్పుడు పేరు వచ్చిందో నాకు తెలీలేదు. నేను పత్రికలు ప్రచురితమయ్యే విజయవాడ లొ గాని మదరాసులొగాని ఉండి ఉంటే నేను ఇంకా పేరు తెచ్చుకునే వీలు కలిగేది అంటారు బాలి. మరి చిత్రకారుడిగా మీ ప్రస్తానం ఎలా ప్రారంభమయిందని అడిగితే ఈనాడు తెలుగు దిన పత్రిక మొట్ట మొదటి కార్టూనిస్టు నేనే . రామోజీరావుగారు స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకోవడం పెద్ద మలుపు. అందులో ఉన్నప్పుడు అన్ని విభాగాల్లోనూ పని చేసాను. యానిమేషన్ గురించి తెలుసుకున్నది అక్కడే అంటారు. రామాయణ, భారత, భాగవత కధలకు బాలి వేసిన బొమ్మలు చూస్తే కధలలోని ఘట్టాలు మన కనుల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తాయి. ఎన్నో కధలకు బొమ్మలు, నవలలకి ముఖ చిత్రాలు గీసారు.నవలల ముఖచిత్రాల గురించి ఒక విషయం చెప్పారు బాలి.ఒక పబ్లిషర్ డెజైన్ విషయమై పిలిచారు. తీరా వెళ్లిన తరువాత నవలలు ముందుగా బాపుగారికి పంపుతాను. ఆయన కాదంటే మీకిస్తానని బేరం పెట్టాడుట. సరే నని బాలిగారు షాపు మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఎప్పటికైన ఆ అల్మారాలలొ నా బొమ్మల కవర్ డిజైన్లతొ నవలలు ఉండకపొవు అనుకున్నరుట. తరువాతి ఆరు నెలల్లొ అదే షాపులొ ఆ చివరినుండి ఈ చివరివరకు బాలి గీసిన ముఖచిత్ర బొమ్మలతొ నిండిపొయాయిట. ఆ విశ్వాసమే ఆయనను ఎన్నొ మెట్లు ఎక్కించింది. నా ఉద్దెశ్యంలొ బాపు తరువాతి స్థానం ఖచ్చితంగా బాలిదే. బాలి గీతలలొ లాలిత్యం, తెలుగుతనం అణువణువునా కనిపిస్తాయి.బాలి బొమ్మలు ప్రతి ఒక్కరికి ఆప్తులుగా దగ్గిర మనుషులుగా కనిపిస్తాయి. కాని బాలిగారికి రావలసింత పేరు రాలేదేమొ అనిపిస్తుంది.మరి చిత్రకారుడిగా ఎలాంటి అనుభవం కలిగిందని అడిగితే బొమ్మలు గీయడంలొ నాకు పరిపూర్ణమైన ఆనందం లభించింది. గొప్ప గుర్తింపులు రాలేదుగాని న్యుజిలాండ్ బైబిల్ సొసైటి వారు నా చేత బొమ్మలు వేయించారు. అలాగే జర్మనీ లొ పర్యావరణం గురించి జరిగిన సదస్సులొ నా బొమ్మలతొ కూడిన పుస్తకాన్ని వెలువరించారు. గుంటూరు చిత్ర కళాపీఠం వారు నాకు "చిత్రకళా సామ్రాట్" అనే బిరుదుని ఇచ్చారు. ఇవన్నినాకు సంతోషం కలిగించే అంశాలే అంటారు. బాపుగారి గురించి చెపుతూ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభలొ "వంగూరి ఫౌండేషన్" వారు బాలి కార్టూన్ల పుస్తకాని బాపుగారి చేత ఆవిష్కరింప చేసారుట. ఆ పుస్తకాన్ని బాపుగారు తిరగేస్తుంటే " కాస్త ఒపికగా చూడండి సార్" అని బాలి గారంటే, బాపు "బాలీ మీకు తెలీకపొవచ్చు. నేను మీ బొమ్మల అభిమనిని" అన్నారుట . ఇంతకన్నా కాంప్లిమెంట్స్ నాకేం కావలి అంటారు బాలి. మరి మీ కార్టూన్ల గురించిన విషయాలు ఎమిటి అంటే కార్టూన్లు గీస్తున్నానుగాని నవ్వించగల "ఫన్" మాటలలొ పలికించలేక పొతున్ననేమో అనిపిస్తోంది అంటారు. ఆయన అలా అన్నా బాలి కార్టూన్లు నవ్వించలేవు అని అనగల వ్యక్తి ఉండడు అనడం అతిశయోక్తి కాదు. పత్రికారంగం ఎలా ఉందని అడిగితే "పబ్లిషర్లు పత్రికాధిపతులు లక్షలు పెట్టి పత్రికలు నడుపుతారు. కాని ఆర్టిస్టు దగ్గిరకొచ్చేసరికి సరియైన పారితోషికం ఇవ్వడానికి వారికి మనసొప్పదు.ఈ విధానం మారాలి అంటారు. మరి మీ కుటుంబ విషయాలు చెపుతారా అన్నప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మయి వైశాలి ఒక అబ్బయి గోకుల్. ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు.అమ్మాయికి ఇద్దరు పిల్లలు చరణి, చందు.వీరి పేర్లతోనే నేను కార్టూన్ స్ట్రిప్ గీసాను. మరి మీ ప్రస్తుత కార్యక్రమాలు ఏమిటి అంటే కొత్త పత్రికలు వచ్చేయి వాటికి బొమ్మలు గీస్తున్నాను. బొమ్మలు గీస్తూనే ఉంటాను.అదే నాకు ఆనందం అంటారు. బాలిగారి కార్టూనులతొ మూడు సంకలనాలు వెలువడ్డాయి. బాలి గారి కలం నుండి మరెన్నో అద్భుతాలు జాలువారాలని కొరుకుంటూ.... సమీహ

31, జనవరి 2009, శనివారం

మనుషులు మంచోళ్లేగానీ ....!!

ఆఫీస్ లొ పని చేసుకుంటున్నాను. మా కొలీగ్ సుబ్బారావు వచ్చి "మనుషులులలొ మంచితనం ఇంకా వుందోయి" అన్నాడు. ఎందుకొ మీకు షడన్ గా అంత నమ్మకం కలిగింది అన్నాను. మొన్న ఒక షాపింగ్ మాల్ కి వెళ్లాము. అక్కడ ఎవరో ఒక కంపెనీ వాళ్లు ఒక చీటీ ఇచ్చి వివరాలు వ్రాసి ఇమ్మన్నారు. లక్కీ డిప్ తీసి ప్రైజ్ వస్తే ఇస్తారుట. అది కేవలం కంపెనీ సేల్స్ పెంచడానికి వాళ్లు అలా ప్రైజులు ఇస్తారట. నేను నమ్మలేదు గాని ఇవాళ ఫొన్ చేసి మీకు లక్కీ డిప్ లొ ప్రైజ్ వచ్చింది అని చెప్పేక మనుషులలొ మంచితనం వుందని నమ్ముతున్నాను అన్నాడు అనందంగా. సుబ్బరావు గారు నాకు ఇలాంటి విషయాలలొ నమ్మకం లేదు. మీరూ నమ్మకండి అన్నాను. భలే వాడివే ! దీంట్లొ నేను నష్ట పొయేది ఎముందిలే. వాళ్లు ప్రైజ్ తీసుకొవడానికి భార్యా సమేతంగా రమ్మని అహ్వానిన్స్టున్నప్పుడు వెళ్లకపోతే బాగుండదు. పైగా ఆదివారం. వెడితే కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది. పైగా ప్రైజ్లు ఇచ్చేది ఒక స్టార్ హొటల్ లొ అన్నాడు. సరే మీ ఇస్టం అన్నాను. ఆదివారం గడిచిపొయింది. మరల సోమవారం ఆఫీసు లొ సుబ్బారావు కలిసేడు గాని నన్ను పలకరించకుండానే వెళ్లిపొయాదు. సరేలే ఏదో పనిలొ ఉన్నడేమొ అనుకున్నాను. లంచ్ టైం లొ కుడా నన్ను వదిలెసి లంచ్ చేస్తున్నప్పుడు గాని నాకు అర్ధం కాలేదు సుబ్బరావు నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు అని. నేనే అతని సీటు దగ్గిరకి వెళ్లి ఏమిటి సంగతి అని అడిగేను. సుబ్బరావు ఒక్కసారిగా కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాడు. నేను ఖంగారుగా ఏమిటి సుబ్బరావు గారూ ఎమైంది అని అడిగాను. నా మనసు పరి పరి విధాలుగా పొయింది. సుబ్బరావు గారి మొహం ఎర్రగా మారింది. మీరు చెప్పింది నెజమే అన్నాడు. ఏ విషయం అన్నాను నేను. మొన్న ప్రైజ్ వచ్చిందని చెప్పానే అది. ఏం జరిగింది అడిగాను నేను. అతడు చెప్పడం ప్రారంభించాడు. నేను మా ఆవిడ ప్రైజ్ తీసుకొవాడానికి ఆదివారం వాళ్లు చెప్పిన హొటల్ కి వెళ్లాము. అది నిజంగానె పెద్ద హొటల్. ఎసి కూడా ఉంది. మమ్మల్ని ఒక హాలు లొ కూర్చొపెట్టారు. ఒక అందమైన అమ్మాయి వచ్చి మీకు ఇంగ్లిష్ లొ చెప్పాలా హిందీ లో చెప్పలా లేక తెలుగు లొ చెప్పాలా అని అడిగింది. నాకు అర్ధం గాక పొయినా తెలుగులొనే చెప్పమని అన్నాను. ముందుగా నాకు వచ్చె జీతం నేను ఎక్కడ పని చేస్తాను లాంటి వివరాలు అడిగింది. తరువాత హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలోని ప్లాట్ల విషయాలు చెప్పడం ప్రారంభించి ఏ ప్లాటు తీసుకుంటారు అని అడిగింది. అమ్మా నాకు ప్లాటు తీసుకొనే ఉద్దేస్యం లేదు తీసుకొనే శక్తి ఒపికా లేదు అన్నాను నేను. చాలా సేపు చాలా విధాలుగా చెప్పి చూసింది. నా సంగతి నీకు తెలుసుగా. ప్లాటు కొనే శక్తి లేదని. మరెందుకు వచ్చారని అడిగింది. అదేమిటమ్మా మీరే కదా ప్రైజ్ తీసుకోవడానికి రమ్మని అన్నారు అంటే చాల చులకనగా మాట్లాడింది. నా భార్యా నేను అవమానాన్ని దిగమింగుకుని వచ్చేసాము అన్నాడు. పొలీసు కేసు పెట్టాలిసింది అన్నాను నేను. పొందిన అవమానం చాలు పొలీసు కేసు కూడా ఎందుకు అంది మా ఆవిడ. ఇదే మన బలహీనత వాళ్ల బలం. ఇలాంటి సంఘటనలు ఎప్పటినుండొ జరుగుతున్నాయి అని నాకు తెలుసు. అయినా సుబ్బరావు లాంటి వాళ్ళు మోసపొతూనే ఉన్నారు. ఇది క్రితం నెలలొ మా మిత్రునికి జరిగింది. మరొకరు మోసపొకూడదనే నా తాపత్రయం. "ఉచితం అంటే దూరంగా ఉండడం సముచితం "అన్నది విషయం.

30, జనవరి 2009, శుక్రవారం

తెలుగు బ్లాగులలో వాడి వేడి చర్చలు

ఈ మధ్య రెండు రోజులపాటు నాకు వచ్చిన మెయిల్ చూసుకోలేదు. సరేకదాని కాస్త సమయం కేటాయించి మెయిల్ తెరిచాను. తెరవాగానే బోలెడు ఉత్తరాలు వచ్చి మీద పడ్డాయి. అమ్మో సుమారు నలభై వరకు ఉత్తారాలు. చాలవారు తెలుగు గుంపు నుండి వచ్చినవే. వాటిలో ఏమి ఉందొ అన్న ఆత్రుత ఉన్నా సమయము తక్కువ ఉండే అన్న బెంగతో నెమ్మదిగా చదవటం ప్రారంభించాను. అమ్మో ఉత్తరాలు చాల సుదీర్ఘంగా వాడిగా వేడిగా ఉన్నాయ్. ఎవరో తెలుగు భాషని తక్కువ చేస్తూ వ్రాసినాందుకు, బాధ పడుతూ కొందరు, తిడుతూ కొందరు, వివరిస్తూ కొందరు చాల సుదీర్ఘంగా కొనసాగాయి. అప్పుడే నాకొక సందేహం వచ్చింది. ఎవరో పర భాషలో వ్రాసిన రాతలకి అంత ప్రాధాన్యం ఇవ్వటం అవసరమా అని. తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒక సమూహంగా అభిప్రాయలు పంచుకుంటూ ఉన్నాము. తెల్ల ఆవుల మధ్య ఒక నల్ల ఆవు చేరింది. అంతే. కన్న తల్లి మీద అభిమానం లాంటిదే మాత్రు భాష మీద అభిమానం కూడా. కాని ఇప్పటి పిల్లలు తల్లి దగిర పెరగట్లేదు కదా. పూర్తిగా పరాయి ప్రదేశంలో (హాస్టల్) పెరుగుతున్నారు. వారికి అభిమానం ఎక్కడినుండి వస్తుంది. ఒక మిత్రుడు ఆ రాతలకి తన బ్లాగులో గొళ్ళెం వేసి మరి తూర్పార బెట్టాడు. దీని వల్ల ఆ రాతలకి మరింత ప్రచారం వస్తుంది. అలాంటి రాతలని అలానే వదిలేస్తే ఒకరిద్దరు చూసి ఊరుకుంటారు. ప్రపంచంలో తెలుగు భాష ఒకటి ఉందని తెలియని వారు బోలెడు మంది ఉన్నారు. అంతర్జాలంలో అసభ్య బ్లాగులు వెబ్ లు చాల ఉన్నాయ్. వాటి గురించి చర్చించడం ఎంత అనవసరమో ఇలాంటి రాతలు గుంరించి చర్చించడం అంత అనవసరం. ఇది పలాయన వాదం అనుకునేరు. తెలుగు బ్లాగులు వ్రాస్తున్న వారందరికీ ఒక అభిరుచి ఒక స్థాయి ఉన్నాయి. దానిని మనం అలాగే కాపాడు కుందాము.

28, జనవరి 2009, బుధవారం

ఉత్తమ పొలిటికల్ కార్టూనిస్ట్ గా శేఖర్




తెల్లని ఛాయ, గుండ్రని మొహము, మొహం మీద నవ్వు, ముక్కు మీద కళ్లజొడు, నెత్తిమీద వయసుకు మించిన బట్టతల, బుర్రలో కమ్యునిస్టు భావాలు ఇది నా స్నేహితుడు శేఖర్ని చూస్తే కలిగే భావాలు. పూర్తి పేరు కంభాలపల్లి చంద్ర శేఖర్. తెలుగులో యం ఎ చెసాడు. పుట్టింది నల్గొండ జిల్లా సుర్యాపెటలొ. తండ్రి తెలంగాణా ఉద్యమం లో పాల్గొని జైలుకెళ్ళి వచ్చాడు. తరువాత రైతు గా ఎదిగి చదివించాడు. నిరుపేద రైతు కుటుం వీరిది. శేఖర్ ఆంధ్ర జ్యోతి పొలిటికల్ కార్టూనిస్టు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2006 సంవత్సరానికి ఉత్తమ పొలిటికల్ కార్తూనిస్టు అవార్డు ప్రకటించింది.ఆ సందర్భంలొ మీ అందరికి పరిచయం చేస్తున్నాను.



కార్టూనిస్టుగా ఎలా మారేవు శేఖరా అని అడిగితే బాల్యం లో మా అన్నగారు నన్ను తన ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలు తిప్పుతూ చదివించాడు. ప్రతి ఊరిలోని దేవాలయమే నాకు క్రీడా వేదిక. అక్కడి పండితుల దీవెనలు వారి భాషా సాహిత్య వాసనలు నాకు అబ్బాయి. తెలుగు సాహిత్యం అంటే అభిమానం, ఆ అభిమానమే తదనంతర కాలంలో కార్టూనిస్టుగా మారడానికి, మారిన తరువాత కలిగిన ఆత్మ విశ్వాసమే ఈ రంగంలొ నిలదొక్కుకోవాడానికి పురిగొల్పాయి. ఈ క్రమం అంత సులువుగా సాగలేదు. ఆ తరువాత గొప్ప గొప్ప కళాకారులు, సంపాదకులు నన్ను అభిమానించి ప్రొత్సహించారు అంటాడు. రోజూ కార్టూన్లు గీయడానికి ఐడియాలు ఎలా వస్తాయి అంటే గత ఇరవయ్ సంవత్సరాలుగా(ఒక సారి పది రోజులు మినహా) ప్రతి రొజూ కార్టూన్లు వేస్తునే ఉన్నాను. రాజకీయ కార్టూన్లలో టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ని హాస్యభరితంగా, వ్యంగ్యంగా కొట్టాలి. రొజూ రెండైన వెస్తాను. ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఎక్కువ వేస్తాము. రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటాము గనుక ఏది ముఖ్యమో దాని మీద పని సాగుతుంది. తొంభై శాతం నేనే అయిడియాలు చేస్తాను. ఎడిటర్ తో కూర్చొని దానిని ఫైనలైజ్ చేస్తాము. పది శాతం మానజేమేంట్, ఎడిటర్ చెప్పేవి ఉంటాయి. మరి నువ్వు మెచ్చిన కార్టూనిస్టు ఎవరు అంటే " ఇంగ్లిష్ కార్టూనిస్టుల పేర్లు చెపుతానని ఊహించకండి. నా సమకాలీన ఆర్టిస్టులనందరినీ గమనిస్తూ వారినుండీ నేర్చుకునే ప్రయత్నం చేస్తాను.




ఆది గురువు మాత్రం ఆర్కే లక్ష్మణ్. మనసా వచా కర్మణా వారినే అనుకరిస్తు వచ్చాను. రాజకీయాలు అర్ధం చేసుకొవడంలొగాని, కార్టూన్ ప్రక్రియ వినియొగించడంలొగాని లక్ష్మణ్ గారిని ఫాలో అవుతునే ఉంటాను . తర్వాత బాపూ గారు. నిజానికి నేను బాపుగారి చేత చివాట్లు తిన్నాను. ఆయన స్టైలు అనుకరించే ప్రయత్నం చేస్తునే ఉంటాను . రాజకీయ కార్టూన్లలో అవి ఒదగడంలేదు. డెవిడ్ లో, థామస్ నేస్ట్ , ఆంటేల్నేస్ ల కార్టూన్లంటే, నాకవి మార్గ దర్శకాలే.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పొలిటికల్ కార్టూనిస్టు అవార్డు ప్రకటించింది కదా వాటి వివరాలు ఎమిటి అంటే ఇది నిజంగా నంది అవార్డు లాంటిదే. పేరుతొపాటు అవార్డు మొత్తంగా ప్రభుత్వం లక్ష రూపాయలు ప్రకటించడం కార్టూనిస్టులకి ఆనందమే. రామచంద్రముర్తి గారు, టంకసాల అశోక్ గారులాంటి సీనియర్ సంపాదకులు ఫొన్ చేసి "అవార్డుకి నువ్వు అర్హుడివే" అన్నాక సంత్రుప్తి చెందా. ఐతే మా ప్రయాణం అయిపోలేదు . లోగడ 1999 చైనా డైలీ కార్టూన్ల పోటీలో అంతర్జాతీయంగా ద్వితీయ బహుమతీ వచ్చింది. ఈ పదేళ్లలొ నా పని నేను చేసుకుంటూ పొతున్నాను. ఒక పది ఎగ్జిబిషన్లు, పారాహుషార్, బ్యాంకు బాబు పుస్తకాలు ప్రచురించాను.


మరి మీ కుటుంబం గురించి చెపుతావా శేఖరు అంటే 1985 లో బాల్య వివాహం చేసుకున్న నేను నిరక్షరాస్యురాలైన నా భార్యకు అక్షర జ్గ్యానం నేర్పించి తనని కంప్యూటర్లో పని చేసే సామర్ధ్యానికి తీసుకువచ్చాను. అలాంటి మా శ్రీమతి చంద్రకళ ఇవాళ అనుక్షణం నన్ను నడిపించే చోదక శక్తిగా మారింది. మా అబ్బాయి నందు బి.టెక్ చదువుతున్నాడు. మా పాప చేతన చదువులతో పాటు సాహితి కళా రంగాలలో దిట్ట. హైదరాబాద్ లోని ఉప్పల్లో ఒక చిన్నగూడు కట్టుకున్నాను. మరి కొన్ని నిజాలు చెపుతాను. అన్ని వృత్తులలో ఉన్నట్టే కార్టూనింగ్ లో కూడా నొప్పి ఉంది. సాటి కళాకారుల రాజకీయాలు ఉన్నాయ్. ఆఫీసులో బలి కావడాలు ఉన్నాయ్. నిరంతరం వేగం, ఒత్తిడి, మానసిక ప్రశాంతతని దూరం చేసి క్వాలిటి వర్క్ అందించలేని దుస్తితి ఉంది. ఇతర కళాకారులను పనిలో అందుకొనేందుకు చేసే ప్రయత్నం లో అపజయాలు ఉన్నాయ్. అందుకోలేకపోతున్నందుకు దిగులు ఉంది. మానసిక అశాంతితో పాటు ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడాలు ఉన్నాయ్. లేకపోతె ఇన్నివేల కార్టూన్లు వేసినందుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేదే. ఇన్ని ప్రతికూల పరిస్తులలో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి గుర్తింపుల వల్లే రీచార్జ్ అవుతున్నాము. మీలాంటి సన్నిహిత మిత్రుల సహచర్యం గొప్ప షీల్డ్ గా ఉండి కాపాడుతోంది. శేఖర్ ఇలాంటి అవార్డులు మరిన్ని అందుకోవాలని కోరుకుంటూ ... అభినందనలతో... సమీహ

23, జనవరి 2009, శుక్రవారం

చదువులు మారాయి

మా చిన్నప్పుడు చదువులు కేజీలలో చడువుకుంతారుట అని ఆశర్యంగా చెప్పుకొనేవారు. కాని ఇప్పుడు జీబీ ( కంప్యూటర్ల కొలమానం) లలో చదువుకొంటున్నారు. కార్పోరేట్ స్కూల్స్ రూపాంతరం చెందుతూ కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ వృద్ధి చెందుతున్నాయి. కార్పోరేట్ సంస్కృతి వృద్ధి చెందడానికి కారణాలు మాత్రం ప్రభుత్వ విధానంలోని లొసుగులు ఇంకా ఉపాధ్యాయులు. మా చిన్నప్పుడు ఉపాధ్యాయుడంటే ఊళ్ళో డాక్టర్ కి ఎంత గౌరవం ఉండేదో ఉపాధ్యాయుడంటే అంత గౌరవం ఉండేది. బడిలో టీచర్ కొట్టిందని అమ్మ నాన్నలకి చెప్పాలంటే భయంగా ఉండేది. నువ్వేం తప్పు చేసావో అని మళ్ళి అమ్మ నాన్నలు కోడతరాని. రోజులు మారాయి. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా కాకుండా కిరాతకులుగాను చెప్పలేని చేష్టలతో ఉంటున్నారు. నిజంగా విద్యార్ధికి భయం చేపుదామన్నా అటు తల్లి దండ్రులు కూడా ఒప్పుకోవడంలేదు. ఇలాంటి పరిస్తుతులలో మా అబ్బాయ్ ని ఒక టెక్నో స్కూల్ లో చేర్చాలని మా ఆవిడ పోరు పెడితే ఆ స్కూల్ చూడటానికి వెళ్ళాము. టెక్నో స్కూల్ అంటే ఆరవ తరగతి నుండి IIT కి సరిపడే విధంగా పిల్లలని తయారు చేస్తారుట. మా ఆవిడ చెప్పింది. కొత్త హంగులతో బాగానే ఉంది. ఉపాధ్యాయుల స్థానాలలో అన్ని చోట్లా కంప్యూటర్లు ఉన్నాయ్. తరగతి గదులలో ప్రొజెక్టర్లు ఉన్నాయ్. సినిమాలలో లాగ తెరలు కూడా ఉన్నాయ్. రిసెప్షన్ లో ఉన్న అమ్మిని అడ్మిషన్ విధానం ఎలా అని అడిగాను. మీ అబ్బాయి ఎంట్రన్స్ టెస్టు వ్రాయాలని చెప్పింది. దానికి ఫీజు ఏమైనా ఉందా అని అడిగితె ఫ్రీ సార్ అని చెప్పి అక్కడ అప్లికేషను తీసుకోండని మరో చోటు చూపించింది. అక్కడికి వెళ్లి క్యు లో నిలబడ్డాను. నా వంతు వచ్చాక కౌంటర్ లోని అమ్మి ఐదు వందలు ఇమ్మని అడిగింది. అదేమిటి ఎంట్రెన్స్ ఫ్రీ అన్నారుగదా అన్నాను. అవును సార్ , ఎంట్రెన్స్ టెస్టు ఫ్రీ , దరఖాస్తు మాత్రమె కొనాలి అని చెప్పింది. ఎంట్రెన్స్ లో పాస్ ఐన తరువాత గదా దరఖాస్తు అవసరం అన్నాను. కాదు ఎంట్రెన్స్ టెస్ట్ వ్రాయాలంటే దరఖాస్తు కొనాలని అమ్మి చెప్పింది. దీనిలో లాజిక్ ఆలోచిస్తుంటే మా ఆవిడ నా పర్సులోంచి డబ్బులు తీసే అమ్మి చేతిలో ఉంచింది. మరుసటి రోజు ఉండయాన్నే మా వాడి చేత ఆరవ తరగతికి ఎంట్రన్స్ రాయించాను. టెస్టు పూర్తి కాగానే మా వాడిని ఎలా వ్రాసావని అడిగాను. దానికి మా వాడు "నువ్వు ఈ స్కూల్ లో ఎందుకు చేరాలని అనుకుంటున్నావు అని అడిగారు" అన్నాడు. మరి ఏమి సమాధానం వ్రాసావని అడిగితె " మా పాత స్కూల్ లో పెద్ద ప్లే గ్రౌండ్ లేదు కాబట్టి" అన్నాడు వాడు. ఆరవ తరగతి కి వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీడి సమాధానాలు ఏమి అనాలో అర్ధం గాక మాట్లాడక ఊరుకున్నాను. రెండవ రోజు అదే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. మీ వాడు ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ ఐయ్యాడు వచ్చి ప్రిన్సిపాల్ ను కలవమని. ఈ లోగ నాకు తెలిసిన విషయం టెక్నో స్కూల్ లో ఒకటవ తరగతి కూడా ఉందని. అంటే మొదటి తరగతి నుండి కూడా IIT కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పేస్తారా? అప్పటి నుండి నా మనసు మనసులో లేదు. స్కూల్ నుండి ఫోన్లు ఆగట్లేదు వచ్చి ఫీజు కట్టమని. నేను ఏమి చేయాలో అర్ధంగాని పరిస్తితి. టెక్నో మాయలో అందరిలాగే కొట్టుకు పోవడమేనా? అవును మరి చదువులు మారాయి. ఉపాధ్యాయులు మారారు. మనమూ మారాలి గాబోలు.

14, జనవరి 2009, బుధవారం

సంక్రాంతి అల్లుడు


11, జనవరి 2009, ఆదివారం

కధా రచయిత శ్రీ సత్యవోలు సుందర సాయి తో పరిచయం



తూర్పు గోదావరి జిల్లలో శోభాయమానమై, సుభిక్షమై అలరారే ఆలమూరు కవి, పండిత, నట, గాయక, రచయితలకు నిలయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన బ్రహ్మశ్రీ పురాణపండ రామ్ముర్తి గారు, అనేక వేద పండితులు పోలాప్రగడ, ఉషశ్రీ, నృశి౦హదేవర, చామర్తి, సుసర్ల, పోతుకూచి , పోరంకి వంటి ఉద్ధండ రచయితలు వెలసిన పుణ్యభూమి. గ్రామంలో నాలుగు చెరువులు ప్రజా అవసరాలకు నిండుగా నిలిచి పాడి పంటలతో గ్రామం విరాజిల్లడానికి కారణభూతం అయ్యాయి. గోదావరి నది నుండి ధవళేస్వరం వద్ద విడి వడిన పెద్ద కాలువ ఆదికవి నన్నయగారి నానాసూక్తినిధిని ఆలమూరు చెంతనే ప్రవహింపచేస్తోంది. శ్రీహరి స్వరూపులైన వైద్యులు జొన్నాడ డాక్టరుగారు, చలపతిరావుగారు వంటి వారు ప్రజారోగ్య పరీక్షలు, సేవలు అందించిన పునీత గ్రామం. భట్టి విక్రమార్క, జనార్ధన, ఆంజనేయ, షిర్డీ సాయి, సుబ్బరాయుడు, బంగారు పాప దేవాలయాలు భక్తికి సోపానాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ భవ్య వాతావరణంలో ఆ దివ్య మూర్తుల మధ్య జన్మించడం ఒక వరంగా భావిస్తున్నాను అంటారు సత్యవోలు సుందర సాయి గారు. సర్వమత , సర్వ కుల ఐక్యత ని౦డుగా నెలకొన్న మా ఆలమూరు సకల కళలకు పుట్టినిల్లు అంటారు అయన. ఒకప్పుడు ఆలము (యుద్ధము) జరిగిన ప్రదేశము కాబట్టి మాకు ఆవేశం సహజ లక్షణం అనేది కుడా వారి నోటి నుండి వచ్చే మాట.

సుందర సాయి గారు మీరు రచయితగా ఎప్పుడు మారేరు? ఆ సందర్భం ఏమిటి?
1976 వ సంవత్సరం నా జీవిత సమరహేల నన్ను రచయితగా మార్చింది. తండ్రిని కోల్పోయి బ్రతుకుతెరువు కోసం రోడ్డున పడిన నన్ను ఈ రచనా వ్యాసా౦గమే నన్ను మనిషిగా నిలిపింది. సమాజంలోని రుగ్మతలు ... వాటిని గమనించిన నాలో ఆవేశాన్ని కలిగించాయి. గుండె గుహలో గంపెడంత శోకాన్ని భరిస్తూ ... ఎగసి వచ్చే భావాలను అదిమి పెట్టలేక వాటిని వ్యక్తీకరించే క్రమంలో రచయిత నయ్యాను. కొందరి క్రౌర్యానికి పతితలుగా మారే యువతుల గాధలు స్వయముగా గమనించాను. అగాధాలు... వ్యధాపూరితాలు... వాటిని కధల రూపంలో మలిచాను. ఆ వ్యధా మూలాలను పాఠకులకు అందించాను. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు నన్ను నిద్రపోనివ్వలేదు. అలజడిని, అశాంతిని కలిగించాయి. హృదయంలోని మధనం రచనలద్వారా బహిర్గతం అయింది.

మీ కుటుంబంలో మీ ముందు రచయితలు ఎవరైనా ఉన్నారా?

నా కుటుంబంలో రచయితలు లేరనే చెప్పాలి. కాని రచనలవైపు ఆసక్తిని పెంచిన వ్యక్తీ మా అన్నయ్య కేశవకుమార్. మా అమ్మగారు సీతాసుందరం బహుముఖ ప్రజ్గ్యశాలి . దాదాపు ఎనిమిది వందల పద్మాలు ఆమె నోటికి వచ్చేవి. రామాయణ, మహా భారతాలు బాగా చదివిన నా మాతృమూర్తి భగవద్గీతను, పోతనగారి భాగవతాన్ని క౦ఠొపాఠ౦గా చేసారు. ఆవిడ సాహిత్య సంస్కారం నాకు ఆమె ఆశీర్వాద ఫలితంగా లభించింది. సకల జనులు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలనే ఆమె ఆకాంక్ష నన్ను ప్రజాప్రయోజనల లక్ష్యం వైపు మరల్చింది. నాన్నగారు, అమ్మ, సోదరుడు - ప్రస్తుతం నా పిల్లలు చి.శారద, శిరీష , ప్రదీప్. స్వాతి, శ్రీవల్లి అందరు నన్ను ప్రేమించే వారె. ఇంక ఎందరో స్నేహితులు నిత్యం నాకు కధాంశాలు అందిస్తూనే ఉన్నారు.

సాహిత్యం తో పరిచయం ఎలా ఏర్పడింది?
గ్రామమంతా సాహిత్య పరిమళం, కుటుంబంలో సంస్కార భావజాలం, పోలాప్రగడ, జీడిగుంటవారు ఆదర్శం. సాహిత్య సంపదకు ఇల్లే నిలయం. కవుల శతకాల జల్లు అమ్మ హృదయం. అందర్నీ అలరించే కధాగమనం సోదరుని నైజం. విలువైన విమర్శలకు నెలవు, ఒదిగిన వాక్ చాతుర్యం అన్ని అబ్బురమే - ఆశ్చర్య జనితమే. ఇల్లాలి అనునయం, ఉత్తేజ౦ కలిగించే పిల్లల ప్రవర్తనం, ఇక ఈ సాయికి సాహిత్యంతో పరిచయం సాధారణ అంశం.
ఇంతవరు మీరు ఎన్ని కధలు వ్రాసేరు? మీ మొదటి కధ ఏది?
రమారమి రెండు వందల దాక కధలు వ్రాసిన జ్జ్యాపకం. ఆరు నవలలు ముద్రితం అయ్యాయి. వంద కధలు మానవీయ విలువలకి సంభందించినవి. ఈనాడు ప్రతినిధిగా ప్రజా సమస్యలమీద ఐదేళ్లపాటు న్యూస్ బ్యూరో తరపున వందలాది ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక నివేదికలు, ఆకాశవాణిలో నాటిక, రూపకం, కధా, కవిత, వార్త విశేషాలు అసంఖ్యాకంగా వ్రాశాను. ఇక దూరదర్శన్ - నా అభిమాన సంస్థ. ఎన్ని వ్రాశానో లెక్క వెయ్యలేదు. గత 27 వత్సారాలలో దాదాపుగా అన్ని విభాగాలలో పని చేశాను. నా కాగితం కలం దూరదర్శన్ కోసం వ్రాయడానికి తహతహ లాడతాయి. నా మొదటి కధా 1976 లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఆ కధా పేరు "రింగులు"
దూరదర్శన్ లో మీ భాద్యతలు ఎలా ఉన్నాయ్?
దూరదర్శన్ లో భాద్యతల కంటే అంకితభావం ముఖ్యం. అధికారం ఎలా మారిన నా వృతి ధర్మం - ప్రజా సంక్షేమం - అదే మూల సూత్రం. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకేలా ఉంటాయి. మనుషులు .. మనస్తత్వాలు సర్వ సాధారణంగా అధికార పటాటోపాన్ని ప్రదర్సిస్తాయి. కొంచం అసహజమైనా వాటిని తట్టుకోవాలి. దూరదర్శన్ కార్యక్రమాల అవసరాల మేరకు మనసును స్వీయసంవిధనాన్ని మలచుకుంటూ ఓర్పుగా సాగడం అలవాటైంది.
రాష్ట్ర ప్రభుత్వం మీకు బంగారు నందిని బహుకరించింది కదా. వాటి వివరాలు చెపుతారా?

చెదలు అనే టెలిఫిలిమ్ - సామాజిక సంభందిత అంశం కేటగిరిలో ప్రధమ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది . స్వర్ణ నందిని గెలుచుకుంది. దర్శకత్వానికి నాకు కూడా ఆ పురస్కారం లభించింది. "చెదలు" గురించి కొద్దిగా చెపుతాను. పంటను కాపాడుకొనే ప్రయత్నంలో ఒక బక్క రైతు దిక్కుతోచక చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తద్వారా సమస్యలు ఇందులో పొ౦దుపరచారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దోపిడీ , కష్టానికి ఫలం లభించినా మార్కట్లో తృణమో ఫణమో ధరకు రాజీపడటం. ఇదే కధాంశం.

దూరదర్శన్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయ్? ఎలా ఉండాలని మీ అభిప్రాయం?

దూరదర్శన్లో కార్యక్రమాలు ఎప్పుడూ బాగుంటాయి. ఇతర చానళ్ళతో పోల్చడం సరి కాదు. ఎన్నో రుచులు ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండవు. ఇది ప్రభుత్వ ఛానల్ . ప్రజా ప్రయోజనమే ధ్యేయం. సంచలనం, అవాస్తవం వంటి వాటికి దూరదర్శన్ దూరం. మా కార్యక్రమాలు ఇంకా మెరుగావ్వాలి. దానికి ప్రభుత్వ సంవిధానంలో మౌలిక మార్పులు జరగాలి.

టీవీ చానల్స్ లో మీకు నచ్చిన కార్యక్రమం ఏది?

నాకు నచ్చిన కార్యక్రమం, నచ్చని కార్యక్రమం అంటూ లేవు. అన్ని మంచి కార్యక్రమాలు నచ్చుతాయి.
మీకు నచ్చిన పుస్తకం వాటి వివరాలు చెపుతారా?
దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కధల సంపుటి. మానవత్వ విలువలకు పెద్ద పీట వేసి సమాజంలోని సంకుచిత ధోరణులను ఎండగట్టి అద్భుత కధాగమనన్ని కనులముందుంచి రసవత్తరంగా కధా శిల్పాన్ని మలచి పాఠకుల హృదయాలను రాగ రంజితం చేసి సమాజ సర్వతోముఖ వికాసానికి సాహిత్యాన్నినిలిపి తెలుగు కధా వినీలాకాశంలో అద్భుతమైన అశాలను పండించి ఇది తెలుగు కధ, మన కధ, శభాష్ అనిపించి, అనేక సమాజహిత అంశాలను సృజించి కధలుగా రుపొందించి, మనకు అపురూపంగా అందించి , తెలుగు కధా చరిత్రలో సుస్థిరంగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ కధలు మరపు రానివి.
సత్యవోలు వారికి ధన్యవాదాలు చెప్పి శెలవు తీసుకుంది సమీహ.
( అక్షర దోషాలుంటే మన్నించండి - సమీహ )


10, జనవరి 2009, శనివారం

ఒక కల చెదిరింది

సత్యం కంప్యూటర్స్ అధినేత రాజుగారు మొన్నటివరకు ఎందఱో యువకులకు అరాధ్య దైవం. సంస్థ అభివృధికి ఆయన పడ్డ శ్రమ వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఒక ఋషి అనుకొన్నారు. ప్రతి ఒక్కరు ఆయనలా కావాలని కలలు కన్నారు. రాష్ట్రానికే తలమానికంగా దేశానికి ఒక కలికి తురాయిలా సత్యం సంస్థ అభివృద్ది చెందినప్పుడు ప్రతీ ఒక్కరు తామే అభివృద్ధి చెందినట్టు తలంచారు. దేశ విదేశాలలో భారత ఖ్యాతి వ్యాపింపచేసిన సంస్థగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. 108 వాహన సేవలు ప్రారంభించినప్పుడు సత్యం కంప్యూటర్స్ ఒక దేవాలయంగా కనిపించింది. కాని అప్పుడే ఆయనలో మరో మనిషి ప్రవేసించాడని బహుశా ఆయనకికుడా తెలిసుండదు. అప్పుడే ఆయనలో ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించి ఉంటాడు. సంస్థకి ఉన్నమంచి పేరును డబ్బుగా మార్చుకొనే దుర్భుద్ధి కలిగించి ఉంటాడు. సులభంగా కోట్లాది రూపాయాలు సంపాదించే దురాలోచన కలిగించి ఉంటాడు. అప్పటిను౦డే ఆయనలోని సత్యం బహుశా తప్పుకొని ఉంటాడు. సత్యం అసత్యం కాకుండా ఉంటే ఎంత బాగుండేది? ఇదంతా ఒక కలే , నిజం కాదు అని ఎవరినా చెపితే బాగుండేది. ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు. ఒక మంచి మనిషి మహిషిగా మారడం ....... ఒక కల చెదిరింది.

7, జనవరి 2009, బుధవారం

రైలు ప్రయాణం గగన కుసుమమే అవుతోంది ఎందుకని?

ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణం అంటేనే దడ పుడుతోంది. వైటింగ్ లిస్టు చూస్తుంటే మూర్ఛ వచ్చేట్టు అవుతోంది. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పొడవాటి వైటింగ్ లిస్టే ఉంటోంది. అకస్మాతు గ వచ్చే ప్రయాణాలకి రైళ్ల మీద ఆధారపడటం మరచిపూవటం మేలనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటాని తెలిసిన మిత్రునివద్ద కొద్దిపాటి గూఢచర్యం చేశాను. రైళ్ళలో తత్కాల్ క్రింద ప్రతి రైలులో దాదాపు రెండు వందల పది బెర్తులు రైల్వేవారు ముందే అడ్డుకొని ఆఖరు నిమిషంలో ఎక్కువ ధరకి అమ్ముకొంటున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇవి పోను మిగిలిన టిక్కట్లను రైల్వే సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. వీరు వివిధ పేర్లమీద, వివిధ వయసులతో టిక్కట్లు కొనేసి తమదగ్గారే అట్తెపెట్టుకొంటున్నారు. వీరు ఆ టిక్కట్ట్లను ఏజెన్సీలకు ఎక్కువ రేట్లకు అమ్ముకొంటున్నట్టు విషయ సేకరణలో తేలింది. రద్దీగా ఉండే తేదీలలో టిక్కట్లను వీరు ఎక్కువగా కొని తమ దగ్గర ఉంచుకొని అదనపు సంపాదన చేస్తూ ప్రయాణికులని ఇంక రైల్వే శాఖని మోసగిస్తున్నరు. దీనికి ఒక్కటే మార్గం. ప్రయాణీకులు ఎవరైనాసరే బయట టిక్కట్లు కొనకుండా కేవలం వైటింగ్ లిస్టు టిక్కట్లు మాత్రమె కొని ఊరుకొంటే ఈ వీరి పైత్యం తగ్గుతుంది.

2, జనవరి 2009, శుక్రవారం

ధర్మ సందేహాలు

ధర్మ సందేహాలు కార్యక్రమం నిజానికి రేడియో కాన్సెప్ట్. ఉషశ్రీ ధర్మ సందేహాలు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఆదివారాలలో ప్రసారం అవుతున్నప్పుడు ఒకచోట బయలుదేరిన వ్యక్తి ఇంటికి చేరేదాక ఆ కార్యక్రమాన్ని వినేవాళ్ళం. అంటే ఆ విధంగా అన్ని ఇళ్ళల్లో రేడియో లో ఆ కార్యక్రమాన్ని వినే వాళ్ళు. అదే కాన్సెప్ట్ ని దూరదర్శన్ తీసుకొని మరలా ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని పురాణ వాచస్పతి శ్రీ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారితో ప్రారంభించింది. ఈ కార్యక్రమ౦ దూరదర్శన్లో ప్రసారం అవుతున్న మొదటి రోజుల్లో చాల మందికి టెలిఫోన్ లైన్ దొరికేదికాదు. లైన్ దోరకడానికే చాల ప్రయాస పడాల్సి వచ్చేది. చంద్ర శేఖర శాస్త్రి గారి క౦ఠ౦లొని గంభీరత్వం అందరిని మంత్ర ముగ్దుల్నిచేసేది. ఆ తరువాత స్థానం మైలవరపు శ్రీనివాసరావు గారిది. కందడై వారు కూడా ప్రేక్షకులని బాగానే అలరించారు. కొన్ని విషయాలలో దూరదర్శన్ కి ఉండే నిబంధనలు కార్యక్రమాలకి ఆటంకం కలిగేలా ఉన్నాయ్. పదమూడు ఎపిసోడ్స్ మించి ఎవరిని కార్యక్రమాలలో ఉంచకూడదు. దీని వల్ల లబ్ద ప్రతిస్తులైన వారిని కూడా కార్యక్రమాలలో కొనసాగించడం కుదరక కార్యక్రమాలలో వన్నె తగ్గుతోంది. కనీసం ఇటువంటి కార్యక్రమాల కైనా నిబంధనలు సడలించాలి. విషయ పరిజ్ఞ్యానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలి కాని నిభందనలకి కాదు. ఈ విషయంలో దూరదర్శన్ తగు నిర్ణయం తేసుకోవాలి. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ ఆచారాల్ని పాటించటానికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలి.

"మువ్వల సవ్వడి" తో దూరదర్శన్

టీవి చానల్స్ లో రికార్డింగ్ డాన్సులు చూసి చూసి విసిగిపోఇన ప్రేక్షకులందరికీ దూరదర్శన్ చక్కని అభి రుచితో కూడిన కార్యక్రమం ప్రసారం చేస్తోంది. అదే మువ్వల సవ్వడి. తెలుగునాట నానాటికీ కనుమరుగవుతున్న సాంప్రదాయక నృత్య కళలని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియచేస్తున్న కార్యక్రమం మువ్వల సవ్వడి. ఈ కార్యక్రమానికి సారధ్యం వహిస్తున్నది దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి యార్లగడ్డ శైలజ. చూడ చక్కని సెట్టింగ్ లో ఒకనాటి సినీ హీరోయిన్ శ్రీమతి ప్రభ ఈ కార్యక్రమానికి సంధాత గ వ్యవహరిస్తుండగా ఎందఱో ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచేస్తున్నారు. రాష్ట్రము నుండే గాకుండా దేశ నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కళాకారులు వస్తున్నారు. దూరదర్శన్ లో ప్రతి ఆదివారం రాత్రి 8.30 ని. కు ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూసి తీరవలసిందే.

1, జనవరి 2009, గురువారం

కొత్త సంవత్సరంలో నా కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరం వస్తోంది. ప్రతీ ఒక్కరు చాల హుషారుగా ఉన్నారు. ప్రభుత్వాలు, పోలిసులు కొత్త కొత్త నియమాలు నిబధనలు పెట్టుకుంటున్నారు. అందిరికి చలా ఆశ, అన్ని మంచిగా మారిపోవాలని. నా మదిలో తళుక్కున ఆలోచన మెరిసింది. కొత్త సంవత్సరం లో నేను కూడా కొత్త జీవితం ప్రారంభించాలి. నా జీవితాంలో ఇకనుండి పాత జీవితానికి కొత్త జీవితానికి చాల తేడా ఉండాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి. మరి నాకున్న చెడు అలవాట్లలో పొగ త్రాగటం ఒక్కటే. నాకిస్టమైన చార్మినార్ బ్రాండు సిగరెట్టు త్రాగటంలో ఉండే మజా దేనిలోనూ లేదు. కాని మా ఆవిడకి ఆ వాసన అస్సలు నచ్చదు. మీరు వస్తున్నారని ముందే తెలుసి పొతుంది లెండి అంటుంది. ఎలాగా అని అడిగితె మీ కన్నా ముందు పొగ వాసనే చెపుతుంది, మీరు వస్తున్నారని అంటుంది. పిల్లలు కూడా నా స్మోకింగ్ గురించి గొడవ చేస్తూనే ఉంటారు. ఇంతమందికి కష్టమైన నా చార్మినార్ బ్రాండ్ సిగరెట్ ధూమ పానం వదిలేస్తే? ఆహ ఏమి ఆలోచన? నిజంగా ఇంటిలో అందరు ఆనందిస్తారు. నా నిర్ణయానికి నేనే సంబర పడ్డాను. మరి ఈ రోజు ఆఖరి రోజు నా చార్మినార్ బ్రాండు సిగరెట్ ధూమ పానానికి. చివరిగా రోజు తీసుకొనే పాన్ డబ్బా దగ్గిర చార్మినార్ సిగరెట్టు తీసుకొని గుండెల నిండా పొగ పీల్చాను. స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. భారంగా ఇంటికి కదిలాను. కొత్త సంవత్సరం మొదటి రోజు వఛేసింది. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉండాలనే అనుకున్నాను. నెమ్మదిగా బయటకి వచ్చేను. ఇంటి బయట పాన్ డబ్బా వాడు నన్ను చూసి చార్మినార్ సిగరెట్ బయట పెట్టాడు. నేను తల అడ్డంగా ఉపేను. వాడు ఆశ్చర్యంగా ఏం సార్ సిగేరట్లు మానేసారా అని ఆందోళనగా అడిగాడు. అవును అన్నాను. వాడు చాల నిరాశ పడినట్లు స్పష్టంగా తెలిసింది. నా నిర్ణయానికి నేనే గర్వ పడి "చార్మినార్ సిగరెట్టు మానేసాను గోల్డ్ ఫ్లేక్ ఇయ్యి " చెప్పాను.