31, జనవరి 2011, సోమవారం

శాంతి స్వరూప్ గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు!!










1974 లో దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై దూరదర్శన్‌లో ఒక ఐకాన్‌గా నిలబడి న్యూస్ రీడర్‌గా, పరిచయకర్తగా దూరదర్శన్ ప్రెక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్న శ్రీ శాంతి స్వరూప్ నరసింహం ఈ రొజు పదవీ విరమణ చేయనున్నారు. 36 సంవత్సారలు తెలుగు ప్రేక్షకులను అలరించిన శాంతి స్వరూప్ నిన్న దూరదర్శన్‌లో వార్తలను చదివి ప్రేక్షకులకు వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేస్తున్న శాంతిస్వరూప్ గారికి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది సమీహ. పదవీ విరమణ చేసినా దూరదర్శన్ వారి సేవలను వినియోగించుకుంటే బాగుడును. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వలని కోరుకుంటూ..!

2, జనవరి 2011, ఆదివారం

హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రాం హెడ్‌గా శ్రీమతి శైలజా సుమన్!!


మల్లాది శైలజా సుమన్..ఈ పేరు తెలియని దూరదర్శన్ ప్రేక్షకులు బహుశ ఉండరు. యాంకరుగా కార్యక్రమ నిర్మాతగా ఆమె దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితులు. ఇప్పటివరకు ఆకాశవాణి దూరదర్శన్ మార్కెటింగ్ విభాగ అధిపతిగా ఉన్న ఆమె హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రాం హెడ్‌గా పదవీ భాద్యతలు చేబట్టారు. కార్యక్రమ నిర్మాణంలో మంచి అభిరుచి నిపుణత కలిగిన శైలజగారి ఆధ్వర్యంలో దూరదర్శన్ మంచి కార్యక్రమాలను తెలుగు ప్రజలకు అందిస్తుందని అసిద్దాం. శైలజగారికి
అభినందనలతో ... . సమీహ!!