30, జనవరి 2009, శుక్రవారం

తెలుగు బ్లాగులలో వాడి వేడి చర్చలు

ఈ మధ్య రెండు రోజులపాటు నాకు వచ్చిన మెయిల్ చూసుకోలేదు. సరేకదాని కాస్త సమయం కేటాయించి మెయిల్ తెరిచాను. తెరవాగానే బోలెడు ఉత్తరాలు వచ్చి మీద పడ్డాయి. అమ్మో సుమారు నలభై వరకు ఉత్తారాలు. చాలవారు తెలుగు గుంపు నుండి వచ్చినవే. వాటిలో ఏమి ఉందొ అన్న ఆత్రుత ఉన్నా సమయము తక్కువ ఉండే అన్న బెంగతో నెమ్మదిగా చదవటం ప్రారంభించాను. అమ్మో ఉత్తరాలు చాల సుదీర్ఘంగా వాడిగా వేడిగా ఉన్నాయ్. ఎవరో తెలుగు భాషని తక్కువ చేస్తూ వ్రాసినాందుకు, బాధ పడుతూ కొందరు, తిడుతూ కొందరు, వివరిస్తూ కొందరు చాల సుదీర్ఘంగా కొనసాగాయి. అప్పుడే నాకొక సందేహం వచ్చింది. ఎవరో పర భాషలో వ్రాసిన రాతలకి అంత ప్రాధాన్యం ఇవ్వటం అవసరమా అని. తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒక సమూహంగా అభిప్రాయలు పంచుకుంటూ ఉన్నాము. తెల్ల ఆవుల మధ్య ఒక నల్ల ఆవు చేరింది. అంతే. కన్న తల్లి మీద అభిమానం లాంటిదే మాత్రు భాష మీద అభిమానం కూడా. కాని ఇప్పటి పిల్లలు తల్లి దగిర పెరగట్లేదు కదా. పూర్తిగా పరాయి ప్రదేశంలో (హాస్టల్) పెరుగుతున్నారు. వారికి అభిమానం ఎక్కడినుండి వస్తుంది. ఒక మిత్రుడు ఆ రాతలకి తన బ్లాగులో గొళ్ళెం వేసి మరి తూర్పార బెట్టాడు. దీని వల్ల ఆ రాతలకి మరింత ప్రచారం వస్తుంది. అలాంటి రాతలని అలానే వదిలేస్తే ఒకరిద్దరు చూసి ఊరుకుంటారు. ప్రపంచంలో తెలుగు భాష ఒకటి ఉందని తెలియని వారు బోలెడు మంది ఉన్నారు. అంతర్జాలంలో అసభ్య బ్లాగులు వెబ్ లు చాల ఉన్నాయ్. వాటి గురించి చర్చించడం ఎంత అనవసరమో ఇలాంటి రాతలు గుంరించి చర్చించడం అంత అనవసరం. ఇది పలాయన వాదం అనుకునేరు. తెలుగు బ్లాగులు వ్రాస్తున్న వారందరికీ ఒక అభిరుచి ఒక స్థాయి ఉన్నాయి. దానిని మనం అలాగే కాపాడు కుందాము.

1 కామెంట్‌: