27, డిసెంబర్ 2008, శనివారం

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. విచిత్రమైన వాతావరణం అతా రైలు లోనే ఉంటుంది. ఉన్న కాసేపట్లోనే సుఖపడి పోదమనె వారి మనస్తత్వం నాకు చాలా ఆశ్చర్యం కలుగ చేస్తుంది. రైలు ఎక్కగానే లుంగీలు మార్చుకునే భీముళ్ళు , రైలు ఎక్కామనే సందేశాన్ని మొబైల్ లో పంపే బక్క ప్రాణులు, దంతావధానం చేసే శతావధానులు, మరొకరిని కూర్చోనీయకుండా పిల్లలని పడుకోపెట్టే తల్లులు, రైలులో ఒక్క మెరుపు తీగైన ఉండదా అని వెదికే యువ కిషారాలు, పక్క వాళ్ల పేపరులోకి తొంగి చూసే ముసలి తాతలు, ఇంకా పక్కవాళ్ళ సామానులు విరగ్గొట్టే రాక్షస పిల్లలు, యుద్ధంలో వీర సైనికులులాగా జనం మధ్య అమ్మేవాడు, ఇంకాఇంకా చాలా మంది. ఇందరి మధ్య నాకు చలం రాసిన మ్యూజింగ్స్ గుర్తుకొస్తుది. చీకటిలో రైలు దూసుకుపోతోంది. అందరు హయిగా నిదుర పోతున్నరు. అందరికి ఆ యంత్రం మీద ఎంతో విశ్వాసం. ఆ రైలు వీరిని గమ్యం చేరుస్తున్దని. ఆపాటి విశ్వాసం నాకు శివుడిమీద లేదని వాపోతాడు. రైలులో ప్రతి ఒక్కరి మనసు రైలు కన్నా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. వారి చింత ఎంతసేపు రేపటి వారి కార్యక్రమాల పైనే. మరికొందరి లగేజి సగంకన్న ఎక్కువ తినుబండరాలే ఉంటాయి. వారి కార్యక్రమం రైలు ఎక్కిన కొద్దిసేపటికి మొదలౌతుంది. నిరంతరంగా గంటల దరబడి కొనసాగుతుంది, తినడానికే రైలు ఎక్కినట్టు. ఇళ్ళల్లో ఉన్నపుడు అన్ని రకాలు తింటారో లేదో కానీ, ప్రయాణంలో మాత్రం ముఫ్ప్ రకాల తినుబండారాలు ఎగ్జిబిషన్ పెట్టినట్టు తింటుఉంటారు. దేశంలో కరువు వస్తే ఏదైనా రైలులో వెదికితే చాలు, దేశానికీ సరిపడా తినుబండారాలు దొరుకుతాయి. అందరికన్నా తెలివెన వాడిననుకోనే కొందరు ఉంటారు. ఎవరు దొరికితే ఉపన్యాసం ఇద్దామా అని వెదుకుతూ ఉంటారు. అందరు వినేలా వారి కున్న పరిగ్నానన్ని (సారీ) పదిమందికి పంచుతూ ఉంటారు. ఏది ఏమైనా వీరంతా మనవాళ్ళు. సగటు భారతీయులు. వారంటే నాకిష్టం. అవును కదా?

2 కామెంట్‌లు: